Don't Miss!
- Sports RR vs DC: సహనం కోల్పోయిన రిషభ్ పంత్వీడియో
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘హే ఇది నేనేనా’ అంటోన్న యువత.. అదరగొట్టిన తమన్
సంగీత దర్శకుడు తమన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాదు.. అంతకు మించి అనే స్టైల్లో సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే తమన్ సోలో బ్రతుకే సో బెటర్ చిత్రానికి ఓ రేంజ్ హైప్ను తీసుకొచ్చాడు. నో పెళ్లి అంటూ అందర్నీ ఓ ఊపు ఊపేశాడు. ఇక రెండో పాటను తాజాగా విడుదల చేశారు. ఈ మేరకు నిన్న సాయంత్రం తమన్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ పాటను ప్రాణం పెట్టి కొట్టాను.. మీ అందరికీ నచ్చుతుందని చెప్పాడు.
సాయి ధరమ్ తేజ్ పట్ల నాకున్న ప్రేమ, నమ్మకానికి ప్రతిబింబంలా ఈ పాట ఉంటుందని, హే ఇది నేనేనా అనే పాట మీ అందరికీ పిచ్చెక్కిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక అలాగే చెప్పిన సమయానికి నేటి ఉదయం పది గంటలుకు పాటను విడుదల చేశారు. ఇక ఈ పాటను విన్న శ్రోతలంతా ఫిదా అవుతున్నారు. మళ్లీ మళ్లీ వినాలనేట్టుగా అందులో ఎంతో ఫీల్ ఉందని కితాబిస్తున్నారు.
హే ఇది నేనేనా అనే పాటను రిలీజ్ చేస్తూ.. సంగీత కళాకారులకు, నా సింగర్స్కు , నా బృందానికి థ్యాంక్స్.. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలోనూ ఎంతో శ్రమించారు. ఎప్పటికీ రుణ పడే ఉంటాను.. ప్రేమలో పడేందుకు మళ్లీ సమయం వచ్చింది. అంటూ ట్వీట్ చేశాడు. ఇక నిజంగానే ఈ పాటను విన్న ప్రతీ ఒక్కరూ ప్రేమలో పడాల్సిందే. ఈ పాట అంతా ఒకెత్తు అయితే వైజాగ్ లొకేషన్స్, బీచ్ అందాలు మరో ఎత్తు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.