Don't Miss!
- News జగన్కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ.. మిక్కీ జే మేయర్ రియాక్షన్
ప్రస్తుతం టాలీవుడ్లో అప్డేట్ల మోత మోగిపోతోంది. ఈ క్రమంలో ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. వైజయంతీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ప్రాజెక్ట్లో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణెలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చాలా రోజులుగా అప్డేట్లు లేకుండా ఉన్న ఈ ప్రాజెక్ట్ నేడు ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్లను ప్రకటించారు.
మహానటి చిత్రం వైజయంతీ మూవీస్ బ్యానర్ను మళ్లీ నిలబెట్టింది. అందుకే ఈ మూవీ యూనిట్ అందరికీ ఇష్టమే. నాగ్ అశ్విన్ కూడా మహానటి యూనిట్ను అంత ఈజీగా వదులుకోలేడు. అందుకే మహానటికి పని చేసిన వారినే ఈ కొత్త ప్రాజెక్ట్కు కూడా తీసుకున్నాడు. సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్ను, కెమెరామెన్గా డాన్ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది.
మరో ప్రపంచాన్ని క్రియేట్ చేద్దామని నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్పై మిక్కీ స్పందించాడు. ఇలా నన్ను ఈ ప్రాజెక్ట్లోకి తీసుకున్నందుకు థ్యాంక్స్.. ఈ ప్రయాణం నిలిచిపోయేలా ఉంటుంది.. అంతేకాకుండా ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నిలిచిపోయేలా ఉంటుంది.. ప్రభాస్, దీపిక, అమితాబ్ వంటి లెజెండ్లతో పని చేయడం ఎంతో గొప్పగా ఉందంటూ నిర్మాతకు థ్యాంక్స్ చెప్పాడు. ఇక ఈఅప్డేట్ ఇప్పుడు నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతూనే ఉంది.