Don't Miss!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ.. మిక్కీ జే మేయర్ రియాక్షన్
ప్రస్తుతం టాలీవుడ్లో అప్డేట్ల మోత మోగిపోతోంది. ఈ క్రమంలో ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. వైజయంతీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ప్రాజెక్ట్లో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణెలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చాలా రోజులుగా అప్డేట్లు లేకుండా ఉన్న ఈ ప్రాజెక్ట్ నేడు ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్లను ప్రకటించారు.
మహానటి చిత్రం వైజయంతీ మూవీస్ బ్యానర్ను మళ్లీ నిలబెట్టింది. అందుకే ఈ మూవీ యూనిట్ అందరికీ ఇష్టమే. నాగ్ అశ్విన్ కూడా మహానటి యూనిట్ను అంత ఈజీగా వదులుకోలేడు. అందుకే మహానటికి పని చేసిన వారినే ఈ కొత్త ప్రాజెక్ట్కు కూడా తీసుకున్నాడు. సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్ను, కెమెరామెన్గా డాన్ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది.
మరో ప్రపంచాన్ని క్రియేట్ చేద్దామని నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్పై మిక్కీ స్పందించాడు. ఇలా నన్ను ఈ ప్రాజెక్ట్లోకి తీసుకున్నందుకు థ్యాంక్స్.. ఈ ప్రయాణం నిలిచిపోయేలా ఉంటుంది.. అంతేకాకుండా ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నిలిచిపోయేలా ఉంటుంది.. ప్రభాస్, దీపిక, అమితాబ్ వంటి లెజెండ్లతో పని చేయడం ఎంతో గొప్పగా ఉందంటూ నిర్మాతకు థ్యాంక్స్ చెప్పాడు. ఇక ఈఅప్డేట్ ఇప్పుడు నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతూనే ఉంది.