Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కేటీఆర్ రిక్వెస్ట్.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దేవి శ్రీ ప్రసాద్.. గ్రేట్ బ్రదర్ అంటూ..
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పాటలకు ఎలాంటి వారైనా సరే చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. తన పాటలతో పసి పాపల నుంచి పండు ముసలి వారితో కూడా తీన్ మార్ స్టెప్పులు వేయించగలడు. ఇక ఇతర స్టార్ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు కూడా రాక్ స్టార్ ను ఎంతగానో లైక్ చేస్తుంటారు. అయితే గతంలో కేటీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు పెట్టుకొని రాక్ స్టార్ దానికి సరైన న్యాయం చేశాడు. అందుకే సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మొదట్లోనే భారీ సినిమా
దేవి శ్రీ ప్రసాద్ టీనేజ్ వయసులోనే తన పాటలతో ఎంతోమందిని మంత్రముగ్దులను చేశాడు. ఇక రెండు పదుల వయసులోకి రాకముందే దేవి లాంటి గ్రాఫిక్స్ సినిమాకు ట్యూన్స్ అందించడమే కాకుండా భారీ స్థాయిలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. ఎలాంటి సినిమా ఛాన్స్ వచ్చినా కూడా పాటలతో సరైన న్యాయం చేస్తూ వస్తున్నాడు.
థమన్ , దేవి శ్రీ ప్రసాద్ ను ట్యాగ్ చేయడంతో
ఇక కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో కూడా దేవి శ్రీ ప్రసాద్ ముందుంటారు. అయితే గత నెలలో కేటీఆర్ ఓ అమ్మాయి సింగింగ్ టాలెంట్ చూసి ఫిదా అయ్యారు. మెదక్ జిల్లాకు చెందిన శ్రావణి పాటలు అద్భుతంగా పడుతుందని తెలియగానే ట్విట్టట్ ద్వారా ఆ అమ్మాయి టాలెంట్ కు సపోర్ట్ చేయాలని దేవిశ్రీప్రసాద్, థమన్ వంటి వారిని ట్యాగ్ చేశారు.
గొప్ప టాలెంట్ అంటూ
ఇక దేవిశ్రీప్రసాద్ కూడా అప్పుడే కేటీఆర్ ట్వీట్ పై స్పందిస్తూ.. నిజంగా గొప్ప టాలెంట్ అంటూ ఆ విషయం తెలియజేసినందుకు స్టార్ కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇక అలాంటి టాలెంటెడ్ సింగర్స్ కోసమే ఎదురుచూస్తున్నట్లు చెబుతూ.. ఇచ్చిన మాట ప్రకారం దేవి ఆ అమ్మాయిని స్టార్ రాక్ స్టార్ ప్రోగ్రాంలో పాడించారు.
గ్రేట్ బ్రదర్ అంటూ
జీ తమిళ్ చానల్ లో దేవి శ్రీ ప్రసాద్ 'స్టార్ రాక్ స్టార్' అనే ప్రోగ్రాం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అందులో టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నారు. ఇక ఇప్పుడు శ్రావణికి కూడా అవకాశం ఇచ్చినట్లు కేటీఆర్ కు చెప్పడంతో ఆయన గ్రేట్ బ్రదర్ అంటూ ప్రశంసలు అందించారు. ఇక ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.