Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మాట వినని నాగచైతన్య ఎడమ చేయి.. తల్లి ఆవేదన!
మాట వినని నాగచైతన్య ఎడమ చేయి.. తల్లి ఆవేదన! చేయి మాట వినకపోవడం ఏంటని అనుకుంటున్నారా. ఇది కచ్చితంగా ఆసక్తికర అంశమే. అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం సవ్యసాచి. విభిన్న చిత్రాల దర్శకుడు చందు ముండేటి దర్శత్వంలో ఈ చిత్రం వెరైటీ కాన్సెప్ట్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఒకే తల్లి కడుపున పుడితే కవలలు అంటారు. అదే ఒకేరక్తం ఒకే శరీరం పంచుకుని పుడితే అద్భుతం అంటారు అనే డైలాగ్ తో నాగ చైతన్య టీజర్ తోనే ఉత్కంఠ పెంచేశాడు.
ఈ చిత్ర కాన్సెప్ట్ గురించి మరిన్ని విషయాలు తెలిసేలా చిత్ర యూనిట్ తాజగా ఓ పాట విడుదల చేసింది. తన కొడుకు అధీనం లేకుండానే అతడి ఎడమ చేయి పనిచేస్తుంటే ఓ తల్లి పడే ఆవేదనని పాట రూపంలో చూపించారు. తన శరీరంలోనే తన సోదరుడు కూడా ఉండడంతో.. అతడి ఎడమచేయి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుందనేదే సవ్యసాచి కథ.
సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఒక్కరంటే ఒక్కరు అనే పాటని తాజాగా విడుదల చేశారు.