Don't Miss!
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
అల్లు అయాన్ మొదలుకొని అల్లు రామలింగయ్య వరకు అందరూ.. ఓ మై గాడ్ డాడీ అంటూ బన్నీ పాట్లు
అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'అల.. వైకుంఠపురములో'. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా తాజాగా మెగా అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్.
గతంలో రెండు.. ఇప్పుడు ముచ్చటగా మూడోది
''జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి'' రూపంలో రెండు బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టిన అల్లు అర్జున్- త్రివిక్రమ్ 'అల.. వైకుంఠపురములో' సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో సింగిల్ 'ఓ మై గాడ్ డాడీ' రిలీజ్ చేసి బన్నీ అభిమానుల్లో కొత్త జోష్ నింపారు త్రివిక్రమ్.
సాంగ్ టీజర్కి మరో మెట్టు పైకి
కొద్ది రోజుల క్రితం 'ఓ మై గాడ్ డాడీ' సాంగ్ టీజర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ అందులో అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్, కుమార్తె అల్లు అర్హను చూపించారు. ఇప్పుడు మరో మెట్టు పైకి ఎక్కి ఫుల్ సాంగ్ ద్వారా అల్లు అరవింద్, అల్లు రామలింగయ్యలను కూడా చూపించి ఆకట్టుకున్నారు త్రివిక్రమ్.
'ఓ మై గాడ్ డాడీ' అంటూ డాడీతో పడిన పాట్లు
'ఓ మై గాడ్ డాడీ' అంటూ డాడీతో పడిన పాట్లు వివరిస్తూ యమ స్టైలిష్ లుక్ లో కనిపించారు అల్లు అర్జున్. ఈ పాటకు తమన్ సంగీతం అందించగా.. రోల్ రిడా, రాహుల్ సిప్లిగంజ్, బ్రేజీ, రాహుల్ నంబియార్, రాబిట్ మాక్లు ఆలపించారు. కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. చివరగా ఈ సాంగ్ అల్లు రామలింగయ్యకు అంకితం అని తెలిపింది 'అల.. వైకుంఠపురములో' యూనిట్.
త్రివిక్రమ్ స్కెచ్ అంటే ఇదే మరి
సాధారణంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ స్కెచ్ వేస్తే దానికి తిరుగే ఉండదు. అలాంటి ఈ టాలెంటెడ్ డైరెక్టర్ బన్నీ అభిమానుల కోసం తన ఆలోచనకు మరింత పదును పెట్టి ఏకంగా అల్లు అర్జున్ కొడుకు అయాన్, కూతురు అర్హను రంగంలోకి దింపడమే గాక అల్లు రామలింగయ్యకు ఈ సాంగ్ అంకితమిచ్చి మెగా అభిమానులను మరింత ఆకట్టుకున్నారు.
'అల.. వైకుంఠపురములో' మూవీ
గీతా
ఆర్ట్స్
బ్యానర్,
హారిక
&
హాసిని
క్రియేషన్స్
సంయుక్త
సమర్పణలో
రూపొందుతోంది
'అల..
వైకుంఠపురములో'
మూవీ.
త్రివిక్రమ్
దర్శకత్వంలో
తెరకెక్కుతున్న
ఈ
చిత్రంలో
సుశాంత్,
నివేదా
పేతురాజ్,
టబు
కీలక
పాత్రలు
పోషిస్తున్నారు.
తమన్
అందించిన
సంగీతం
ఈ
సినిమాకు
ప్లస్
కానుంది.