సుకుమార్ - దేవి శ్రీ ప్రసాద్ సినిమాపై మరో కన్ఫ్యూజన్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కాంబినేషన్స్ లలో దేవి శ్రీ ప్రసాద్ - సుకుమార్ కాంబినేషన్స్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వారి కాంబినేషన్ లో వచ్చే సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ కలెక్షన్స్ తో సంబంధం లేకుండా మ్యూజికల్ హిట్స్ గా నిలుస్తాయి. సుకుమార్ సినిమా అంటే రాక్ స్టార్ బెస్ట్ మ్యూజిక్ ఇస్తాడాని ఎవరైనా ఊహిస్తారు.
ఇక దేవి శ్రీ ప్రసాద్ ను హీరోగా పెట్టి సినిమా చేయాలని ఆ మధ్యలో సుకుమార్ గట్టిగానే ప్రయత్నాలు చేశాడు. కానీ ఇద్దరు బిజీగా ఉండడం వలన కుదరలేదు. తరువాత ఎప్పుడైనా చేయాలని అనుకుంటునప్పటికి కుదరడం లేదు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం దేవిశ్రీప్రసాద్ హీరోగా ఛార్మి ఒక సినిమాను నిర్మించనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
ప్రస్తుతం దేవి అయితే చాలా బిజీగా ఉన్నాడు.

ఇక ఛార్మి పూరి సొంత ప్రొడక్షన్ లో సహా నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక పూరి శిష్యుడు చెప్పిన కథ ఒకటి దేవిశ్రీప్రసాద్ కు సెట్టవుతుందని ఛార్మి సజెస్ట్ చేసినట్లు టాక్ వస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు గాని సుకుమార్ తో దేవి హీరోగా చేసే అవకాశం ఇప్పట్లో లేదని తెలుస్తోంది. ఎందుకంటే సుక్కు ఒక సినిమాకు ఎంత టైమ్ తీసుకుంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక పుష్ప రెండు భాగాలుగా వస్తుండగా విజయ్ దేవరకొండతో కూడా ఒక స్టోరీని ఫిక్స్ చేసుకున్నాడు కాబట్టి మరో మూడేళ్ళ వరకు కొత్త ప్రాజెక్ట్ పై ఆలోచించకపోవచ్చు. ఇక దేవిశ్రీప్రసాద్ హీరోగా చేస్తాడా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications











