Don't Miss!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తొలిప్రేమ సాంగ్ రీమేక్.. రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్
అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం 'మిస్ మ్యాచ్'. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా 'సలీం' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న'మిస్ మ్యాచ్' విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'యు' సర్టిఫికెట్ ను పొందిందీ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న 'మిస్ మ్యాచ్' ను విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు తెలిపారు.
తొలిప్రేమ సినిమాలోని ఈ మనసే సాంగ్ రీమేక్..
'మిస్ మ్యాచ్' చిత్రంలోని 'ఈ..మనసే' పాటను పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ఈరోజు విడుదల చేసాడు. ఈ సందర్బంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 'మిస్ మ్యాచ్' సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నానని తెలిపాడు. హీరో ఉదయ్ శంకర్కు శుభాకాంక్షలు తెలిపాడు. చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపాడు.
అది కూడా ఆయన చేతుల మీదుగానే..
హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ...తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ 'మిస్ మ్యాచ్' చిత్రంలోని 'ఈ మనసే' గీతాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ చిత్రం అందరికి నచ్చుతుందని భావిస్తున్నానని అన్నారు. తన మొదటి సినిమా 'ఆట కదరా శివ' సినిమా లోని గీతాన్ని గతంలో పవన్ కళ్యాణ్ విడుదల చేసి ఆశీర్వదించాడని గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రం నటుడుగా తనకు గుర్తింపును తెచ్చిందన్నారు.
ఈ పాట ఆయన రిలీజ్ చేయడం..
ఆయన నటించిన 'తొలిప్రేమ' చిత్రం ఆరోజుల్లో ఎంతో ఘనవిజయం సాధించిందో అందరికీ తెలుసున్నారు. ఆ చిత్రంలోని 'ఈ మనసే' పాటను ఈ 'మిస్ మ్యాచ్' లో తనపై చిత్రీకరించటం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఒకటే షాట్గా ఈ పాట చిత్రీకరించటం మరో విశేషమని తెలిపాడు. అలాంటి ఈ గీతం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల అవటం సంతోషంగా ఉందన్నాడు. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారని, నిర్మాతలు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు అన్నాడు. శంకర్.
Recommended Video
అన్ని అంశాలతో తెరకెక్కిన చిత్రం..
నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సాంగ్ రిలీజ్ చెయ్యడం హ్యాపీ గా ఉందన్నారు. ఆడియన్స్ కోరుకుంటున్న అన్ని అంశాలు సినిమాలో ఉంటాయని తెలిపాడు. సినిమా బాగా వచ్చిందని పేర్కొన్నాడు. డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ బాగా తీశారని కొనియాడాడు. ఉదయ్ శంకర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చక్కగా నటించారన్నాడు. డిసెంబర్ ఆరున చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోందని ప్రకటించాడు. మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్టన్ ఇలియాస్ మాట్లాడుతూ...సినిమాలో అన్ని పాటలు బాగా వచ్చాయన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ పాట విడుదలవ్వడం సంతోషమని అన్నారు. ఆడియన్స్ అందరికి ఈ సాంగ్ నచ్చుతుందని భావిస్తున్నానని అన్నారు.