Don't Miss!
- News Nita ambani సెంటిమెంట్: బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకుని.. ఆపై!!
- Finance Stock Market: భారీ లాభాల్లో విహరిస్తున్న సెన్సెక్స్-నిఫ్టీ.. అంతా బుల్స్ హవాతోనే..
- Sports SRH vs MI: ఆ దిగ్గజ క్రికెటర్ వల్లనే చరిత్ర సృష్టించా- అభిషేక్ శర్మ
- Automobiles ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Lifestyle Car Vastu Tips: కారు ఉందా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి..ఈ డైరెక్షన్ లో పార్క్ చేస్తే
- Technology Poco నుంచి F సిరీస్ లో కొత్త ఫోన్! స్పెసిఫికేషన్లు లీక్, వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
పేట లిరికల్ సాంగ్ కేక.. మాస్ బీట్తో కిక్కెక్కించేలా..
ఓ వైపు 2.O మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంటే. మరో వైపు పేట మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. పేటలోని తొలి సింగిల్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన మరన మాస్ అనే పాటను యూట్యూబ్లో రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చగా, ఈ పాటకు వివేక్ సాహిత్యం అందించాడు.
మరన మాస్ అనే పాటలో ఈ కాళి గేమ్ను మీరు ఇక చూస్తారు అని ఓ లైన్ రాశారు. కాళీ అనే పేరు రజనీకి ఎంతో ఇష్టం. గతంలో కాళీ అనే చిత్రంలో రజనీ నటించాడు. మల్లం మలారమ్ అనే సినిమాలో కాళీ పాత్రను పోషించాడు.
రజనీ మాస్ అప్పీల్కు తగినట్టుగా అనిరుధ్ పక్కాగా మాస్ పంథాలో సాగే జానపద పాటను సమకూర్చారు. 2.0 చిత్రం తర్వాత రజనీకాంత్ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దిఖీ, సిమ్రాన్, త్రిషా, బాబీ సింహా తదితరులు నటించారు.