Don't Miss!
- News ప్రధాని మోదీ ఎదుటే కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్న టీడీపీ ఎమ్మెల్యే.. తరువాత రియాక్షన్ ఏమిటంటే..?
- Sports IPL 2024 సీజన్లో చెలరేగేది ఆ కుర్రాడే: సునీల్ గవాస్కర్
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Automobiles ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
మ్యాజికల్ డేట్.. సిరివెన్నెల ప్రశంసలపై రామజోగయ్య శాస్త్రి కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలోని లాహే లాహే పాట ఇప్పుడు ఎంతగా ట్రెండ్ అవుతోందో అందరికీ తెలిసిందే. ఈ పాటను రాసిన రామజోగయ్య శాస్త్రిపై రెండు మూడు రోజులుగా ప్రశంసలు లభిస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ పాటలోని సాహిత్యాన్ని, మాధుర్యాన్ని ఆస్వాధిస్తూ పాట రచయిత మీద అభిమానాన్ని చాటుతున్నారు. అయితే రామజోగయ్య శాస్త్రి ఓ విషయాన్ని చెప్పారు.
చీరకట్టులో హంస నందిని సోయగాలు... స్లీవ్ లెస్ జాకెట్తో మరింత అందంగా
తన గురువైన సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా ఫోన్ చేసి అభినందించారట. ఆ రోజును ఎప్పటికీ మరిచిపోలేను అని ఎమోషనల్ అయ్యారు. మార్చి 31 మ్యాజికల్ డేట్ అంటూ తన గురువు ప్రశంసలను గుర్తుకు తెచ్చుకున్నారు. కాసర్ల శ్యాం, సిరాశ్రీ, లక్ష్మీ భూపాల్ వంటి వారు ఫోన్ చేసి అభినందించారని రామజోగయ్య శాస్త్రి చెప్పుకొచ్చారు. అలా అందరిలోకెల్లా సిరివెన్నెల గురువు గారు చెప్పిన మాటలు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చాయని అన్నారు.
నీ విజయం నాకన్నా ఎవరికి ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది చెప్పు అని అన్నారు. ఆ మాట చాలు ఎంతో గొప్పగా అనిపించిందంటూ రామజోగయ్య శాస్త్రి ఎమోషనల్ అయ్యారు. మొత్తానికి ఆచార్య లోని ఈ మొదటి పాట అయినా లాహే లాహే లిరికల్ వీడియో మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతూ దూసుకుపోతోంది. ఇక ఈ నెలలో మరిన్ని పాటలు వదిలేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోన్నట్టు తెలుస్తోంది.