Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Mahesh Babu: లవర్స్ డే రోజు సర్కారు వారి పాట అదిరిపోయే సర్ప్రైజ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా పై రోజురోజుకు అంచనాలు అమాంతంగా పెరిగి పోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసిన తర్వాత చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే మరి కొన్ని పాటలను కూడా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ విడుదల తేదీ వాయిదా పడుతుండడంతో ప్రమోషన్ కు మధ్యలో బ్రేక్ పడింది. అసలైతే ఈ ఏడాది సంక్రాంతికి సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మిగతా సినిమాల నుంచి పోటీ రావడం అలాగే కరోనా కష్టకాలంలో సినిమాను విడుదల చేసే అవకాశం లేక వాయిదా వేసుకోవలసి వచ్చింది.. సర్కారు పాటను మే 12వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల ఒక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
సినిమా విడుదల తేది పై క్లారిటీ ఇవ్వడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా వేగవంతం చేయాలని చూస్తున్నారు. ఇక ముఖ్యంగా ఈ సినిమా మ్యూజిక్ పై అయితే చాలా అంచనాలు పెట్టుకున్నారు. సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. సినిమా పాటలు అనుకున్నదానికంటే ఎక్కువ స్థాయిలో ఆకట్టుకుంటాయని కూడా ప్రేక్షకుల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయ్యింది. ఇక తమన్ కూడా ఎప్పటికప్పుడు పాటలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా సినిమాకు సంబంధించిన మొదటి పాటను విడుదల చేయాలని అధికారికంగా క్లారిటీ అయితే ఇచ్చేశారు.
ఈ సినిమాలో కీర్తి సురేష్ మహేష్ బాబు కు జోడిగా నటించిన విషయం తెలిసిందే. అయితే వీరి కలయికలో వచ్చిన రొమాంటిక్ సన్నివేశాల ఆధారంగా సినిమాలో ఒక పాట కూడా ఉంటుందట. లేటెస్ట్ ట్రెండింగ్ సింగర్ సిద్ శ్రీరామ్ పాట పాడినట్లు గా తెలుస్తోంది. ఆ లవ్ సాంగ్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుందని కూడా చెబుతున్నారు. మహేష్ బాబు కీర్తి సురేష్ ఏ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తారుట. వీరి మధ్యలో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి అని తెలుస్తోంది.
దర్శకుడు పరశురామ్ ఇదివరకే గీత గోవిందం లాంటి సినిమాలో హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు కీర్తి సురేష్ లాంటి స్టార్స్ సరికొత్తగా రొమాంటిక్ లవ్ ట్రాక్ ను వెండితెరపై చూపించబోతున్నాడు. ఫస్టాఫ్ మొత్తం లో కూడా హీరో హీరోయిన్ కి సంబంధించిన సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయట. ఇక సెకండాఫ్లో అభిమానులు విజిల్స్ వేసేలా యాక్షన్ సన్నివేశాలు హీరో ఎలివేషన్ సీన్స్ అలాగే మంచి సందేశం కూడా ఉంటుందట. మరి ఈ సినిమాతో మహేష్ బాబు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఇక సర్కారు వారి పాట సినిమాను మే 12వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇటీవల అధికారికంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే..