Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
వినాయక్ చేతుల మీదుగా ‘శుభలేఖ+లు’ వీడియో సాంగ్
పెళ్లి అంటే నమ్మకంపై మాత్రమే నిలబడే బంధం. అంటే ఆ తంతు నిజాయితీగా జరగాలి. ఆ నిజాయితీ జీవితాంతం ఉంటుందనే నమ్మకం ఉన్నప్పుడే ఏ పెళ్లి బంధమైనా ఆనందంగా కొనసాగుతుంది. అబద్ధపు పెళ్లిల్లలో ఆడంబరం ఉంటుంది. కానీ ఆనందం ఉండదు అనే అంశం చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతోన్న సినిమా ''శుభలేఖ+లు''. ఈ మూవీ టైటిల్ నుంచి.. ఆ మధ్య విడుదల చేసిన టీజర్, ఫస్ట్ వీడియో సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రెండో వీడియో పాటను స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు.
'శృంగారాలహరీ శృతజన శుభకరీ సౌందర్యలహరీ' అంటూ అచ్చ తెలుగు పదాలతో సాగే ఈ పాటపై వినాయక్ ప్రశంసల వర్షం కురిపించాడు. కెఎమ్ రాధాకృష్ణన్ సంగీతం అందించిన ఈ పాట ట్యూన్ వినగానే ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు కెఎమ్ రాధాకృష్ణ సంగీతం ఓ హైలెట్ గా నిలుస్తుందని దర్శక, నిర్మాతలు ముందు నుంచీ చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడీ రెండో వీడియో సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇప్పటి
వరకూ
ఈ
సినిమాకు
సంబంధించి
ప్రతి
విషయంలోనూ
పాజిటివ్
వైబ్స్
వస్తున్నాయి.
వాటిని
ఈ
పాట
రెట్టింపు
చేసింది.
చాలా
ఇన్నోవేటివ్
కథాంశంతో
రూపొందుతోన్న
ఈ
చిత్రంతో
శరత్
నర్వాడే
దర్శకుడుగా
పరిచయం
అవుతున్నాడు.
ఇప్పటికే
షూటింగ్
పూర్తి
చేసుకున్న
''శుభలేఖ+లు''చిత్రానికి
సంబంధించి
ప్రస్తుతం
పోస్ట్
ప్రొడక్షన్
పనులు
జరుగుతున్నాయి.
సినిమాను
సెప్టెంబర్
లో
విడుదల
కాబోతోంది.
సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని ఓ కీలక పాత్రలో నటిస్తోంది. వంశీ నెక్కంటి, మోనా బేద్రే, అప్పాజీ, డా. ఇర్ఫాన్, తిరువీర్, సింధు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
కథ- మాటలు : జనార్ధన్- విస్సు, సంగీతం : కెఎమ్ రాధాకృష్ణన్, సినిమాటోగ్రఫీ : మురళీమోహన్ రెడ్డి, ఎడిటర్ : మధు, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ప్రొడక్షన్ కంట్రోలర్: కె. సూర్యనారాయణ, నిర్మాతలు : సి విద్యాసాగర్, ఆర్.ఆర్. జనార్ధన్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శరత్ నర్వాడే.