Don't Miss!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రముఖ గాయని, నటి ఇకలేరు.. సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి
ప్రఖ్యాత గాయకుడు, దివంగత కిషోర్ కుమార్ మాజీ భార్య, గాయని, నటి రుమా గుహా తకుర్తా ఇకలేరు. వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతూ సోమవారం ఉదయం కోల్కతాలో మరణించారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. రుమాకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. బాలీవుడ్ గాయకుడు అమిత్ ఆమె కుమారుడే.
రుమా రెండో కుమారుడు ఆమె మరణాన్ని మీడియాకు వెల్లడించారు. నా తల్లి నిద్రలోనే మరణించారని మా ఫ్యామిలీ డాక్టర్ ధృవీకరించారు. బహుశా ఉదయం 6 నుంచి 6.15 గంటల మధ్య మరణించి ఉంటారని వెల్లడించారు అని రుమా కుమారుడు ఆయన్ గుహ తెలిపారు. అత్యక్రియలు సోమవారం సాయంత్రం నిర్వహించారు.
రుమా డ్యాన్సర్గా కెరీర్ను ఆరంభించారు. ముంబైకి చేరుకొన్న తర్వాత గాయనిగా, నటిగా మారారు. 1950 తొలినాళ్లలో కిషోర్ కుమార్ను వివాహం చేసుకొన్నారు.
ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే రూపొందించిన గణశాస్త్రు, అభిజాన్ సినిమాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. పర్సనల్ అసిస్టెంట్, నిర్జన్ సైయికతే, దాదర్ కృతి, 36 చౌరంగీ లేన్, అగున్, ఆషా ఓ భలోభాషా, వీల్ చైర్, ఇంద్రజిత్, సంఘర్ష చిత్రాలు అత్యంత ప్రజాదరణ పొందాయి. చివరిసారిగా మీరా నాయర్ దర్శకత్వంలో రూపొందిన ది నేమ్సేక్ చిత్రంలో నటించారు.
రుమా మృతికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. సినీ, సంగీత రంగానికి ఆమె చేసిన విశేష సేవలను చిరకాలం గుర్తుండి పోతాయి. రుమా మృతి విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం అని ట్విట్టర్లో తెలిపారు.