మృత్యువు ప్రముఖ గాయని పోరాటం.. అండగా ప్రధాని నరేంద్రమోడీ
భారతీయ సినిమా పరిశ్రమలో ప్రముఖ గాయని శ్రద్దా సిన్హా మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారనే విషయం తెలుసుకొన్న ప్రధాని నరేంద్రమోదీ వెంటనే స్పందించారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
శారద సిన్హా విషయానికి వస్తే.. బీహార్కు చెందిన ప్రముఖ గాయని జానపదాలను అద్బుతంగా పాడటంలో దిట్టగా పేరు తెచ్చుకొన్నారు. 1970లో ఆమె కెరీర్ ప్రారంభించారు. భోజ్పురి, మైథిలి, హిందీ భాషల్లో జానపద రంగానికి విశేషంగా సేవలు చేశారు. హిందీలో కూడా కొన్ని పాటలు పాడారు. సంచలన విజయం సాధించిన హమ్ ఆప్కే హై కౌన్ సినిమాలో ఆమె పాడిన పాట పాపులర్ అయింది.

భారతీయ జానపద సంగీతానికి విశేషంగా సేవలు చేసిన శారద సిన్హాకు కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించింది. ఆమకు దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ అవార్డును 2018 సంవత్సరంలో అందజేశారు. ఆమె జాతీయ ఉత్తమ గాయని అవార్డు కూడా అందుకొన్నారు. ప్రాంతీయ భాషలో మ్యూజిక్ రంగానికి విశేషంగా సేవలు అందించారు.
శారద సిన్హా సుమారుగా 72 ఏళ్ల వయసులో వృద్దాప్య సంబంధింత ఆరోగ్య సమస్యలతోను అలాగే బ్లడ్ క్యాన్సర్తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించడంతో ఆమెను హస్పిటల్లో చేర్పించి చికిత్స అందించారు. అయినా గాయని హెల్త్ మరింత విషమంగా మారడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది.

శారద సిన్హా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తను ప్రధాని నరేంద్రమోదీ తెలుసుకొన్నారు. వెంటనే ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీసిన ఆయన అధికారులకు ఆదేశాలు అందించారు. ఎయిమ్స్లో మెరుగైన చికిత్సను అందించాలని ఆదేశించారు. వ్యక్తిగతం కూడా ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి.. తనదైన రితీలో భరోసాను ఇచ్చారనే విషయం తెలిసింది.
అయితే శారద సిన్హా ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్య బృందం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం గాయని ఆరోగ్యం స్థిరంగా ఉంది. ప్రస్తుతం వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నాం. ఆమె వెంట తన కుమారుడు అన్షుమన్ సిన్హా ఉన్నారు. ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు సమాచారం చేరవేస్తున్నారు అని తెలిపారు.


Click it and Unblock the Notifications











