Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సైరా మ్యూజిక్ డైరెక్టర్ ఇతడే: అఫీషియల్ ప్రొమో రిలీజ్ చేసిన కొణిదెల ప్రొడక్షన్స్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. గతేడాది ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసినపుడు ప్రధాన తారాగణం, టెక్నీషియన్స్ వివరాలు విడుదల చేశారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో భాగం కావడం, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం లాంటి అంశాలు సినిమాపై మరింత హైప్ పెంచాయి. అయితే పలు కారణాలతో రెహమాన్ ఈ చిత్రం నుండి తప్పుకున్నారు. కెమెరామెన్ కూడా మారి రత్నవేలు ఫిక్స్ అయ్యాడు.
అయితే సంగీత దర్శకుడు ఎవరు అనే విషయంలో చాలా కాలం పాటు చిత్ర బృందం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో తమన్, దేవిశ్రీ, కీరవాణి ఇలా చాలా పేర్లు వినిపించాయి. అయితే సైరా టీం ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదిని ఫైనల్ చేస్తూ అఫీషియల్ ప్రోమో విడుదల చేశారు.
ఈ మ్యూజిక్ డైరెక్టర్ హిందీలో ఉడాన్, వేక్ అప్ సిద్, ఐషా, దేవ్ డి, నో వన్ కిల్డ్ జెస్సికా, ఇషక్ జాదే, ఇంగ్లిష్ వింగ్లిష్, బాంబే వెల్వెట్, ఉడ్తా పంజాబ్, క్వీన్ వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. ఈ ప్రోమోకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. ఇక మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యే టీజర్ ఏ రేంజిలో ఉంటుందో చూడాలి.
చిరంజీవితో పాటు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, సుదీప్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఆదివారం గీత గోవిందం సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న చిరంజీవి.... తీరిక లేకుండా షూటింగ్ జరుగుతోందని, ఒక్కోసారి రాత్రి 2 గంటల వరకు చిత్రీకరణ చేస్తున్నామని, వందల సంఖ్యలో ఆర్టిస్టులు ఇందులో పాల్గొంటున్న విషయం వెల్లడించారు. 2019లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.