Don't Miss!
- News ఘర్ వాపసీ: రేవంత్ రెడ్డిని కలిసిన కేకే, కేసీఆర్ గౌరవం ఇచ్చారు కానీ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
నా ప్రాణం పెట్టి చేశాను.. తమన్ ఎమోషనల్ ట్వీట్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాపై భారీగానే హైప్ క్రియేట్ అవుతోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన నో పెళ్లి అనే ఫస్ట్ సింగిల్ ఓ రేంజ్లో వైరల్ అయింది. రానా, వరుణ్ తేజ్ వంటి వారి సాయంతో బాగానే ప్రమోట్ చేశాడు. ఇక నో పెళ్లి అనే సిగ్నేచర్ స్టెప్ ఓ రేంజ్లో క్లిక్కయింది. ఇక రెండో పాట కోసం వేసిన ఎత్తు అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీని కోసం జనాలను బాగానే పిచ్చోళ్లను చేశారు.
సెకండ్ సింగిల్ కోసం చేపట్టిన ప్రమోషన్స్ భాగానే వైరల్ అయ్యాయి. 'ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి'.. అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. టాలీవుడ్ సింగిల్ ఆర్మీ అనే వాట్సాప్ గ్రూపులోంచి ఈ మధ్యే నిఖిల్, నితిన్, రానావంటి వారు పెళ్లి చేసుకుని అందులోంచి లెఫ్ట్ అయ్యారని, ఇక తాజగా తన వంతు వచ్చిందని ప్రభాస్కి సారీ చెబుతూ లెఫ్ట్ అయ్యాడు. అయితే ఈ ప్రకటన తన పెళ్లి గురించేనని కొందరు పప్పులో కాలేశారు.
తీరా అది సోలో బ్రతుకే సో బెటర సెకండ్ సింగిల్ కోసమని తెలిశాక అందరూ ముక్కున వేలుసుకున్నారు. ఇక ఈ పాట రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు తమన్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. రేపటికి అంతా సిద్దమైంది.. ఈ పాటను నా ప్రాణం పెట్టి చేశాను.. సాయి ధరమ్ తేజ్ పట్ల నాకున్న ప్రేమ, నమ్మకానికి ప్రతిబింబంలా ఈ పాట ఉంటుంది. హే ఇది నేనేనా అనే పాట మీ అందరికీ పిచ్చెక్కిస్తుందని చెప్పుకొచ్చాడు.