Don't Miss!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- News 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి!: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సర్కారు వారి పాట మూడో సింగిల్ పూర్తి.. తమన్ ట్వీట్ వైరల్
సర్కారు వారి పాట సినిమా ఎంత ఆలస్యంగా మొదలైందో అందరికీ తెలిసిందే. మామూలుగా అయితే ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగాల్సింది. కానీ కరోనా, లాక్డౌన్ వల్ల పూర్తిగా షెడ్యూల్ మారిపోయింది. అలా లాక్డౌన్ మొత్తం కూడా సర్కారు వారి పాట టీం ఇంట్లోనే ఉండిపోయింది. అయితే రోజులు గడుస్తున్నాయి కానీ లాక్డౌన్ ఎత్తివేయడం లేదు.. షూటింగ్ ప్రారంభించడం లేదు. అందుకే ఆ సమయంలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ పనులను కూడా ప్రారంభించేశారు.
అలా లాక్డౌన్లో తమన్ తన మ్యూజిక్ పనులను మొదలుపెట్టేశాడు. ఈ మేరకు ఆ మధ్య ఓ ట్వీట్ కూడా చేశాడు. అద్భుతమైన ట్యూన్స్ వస్తున్నాయని తమన్ చెప్పుకొచ్చాడు. తాజాగా తమన్ ఓ ట్వీట్ వేశాడు. ఇందులో అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఇప్పుడే యూనిట్ను కలిశాను.. మూడో సాంగ్ కూడా పూర్తయింది.. అదిరిపోయేలా వచ్చిందంటూ తెలిపాడు. మొత్తానికి తమన్ మాత్రం ఫుల్ జోష్లో ఉన్నట్టు కనిపిస్తోంది.
ఇప్పటికే సర్కారు వారి పాట అంటూ వదిలిన థీమ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్కు బాగానే ఎక్కేసింది. ప్రస్తుతం సర్కారు వారి పాట యూనిట్ దుబాయ్లో ఉన్న విషయంతెలిసింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ను అక్కడి ఎడారి ప్రాంతంలో తెరకెక్కిస్తోన్న తెలుస్తోంది. ఇంక నెల రోజులు అక్కడే లాంగ్ షెడ్యూల్ ఉండబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగేందుకు రెడీగా ఉంది.