Don't Miss!
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- News భోజనాలున్నాయమ్మా వెళ్లొద్దు.. విజయసాయికి షాక్; ఇజ్జత్ తీసిన టీడీపీ!!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సర్కారు వారి పాట.. అప్పుడే మొదలెట్టిన థమన్.. త్వరలో స్పెషల్ సాంగ్?
సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు లాంటి సక్సెస్ తరువాత చేస్తున్న చిత్రం సర్కారు వారి పాట. గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ సరికొత్త లుక్ తో అలరించబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ స్పెషల్ లుక్ తో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించబోతున్నాడు.
ఇకపోతే చాలా కాలం తరువాత మహేష్ బాబు థమన్ ని సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏమిటనే విషయంలో అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. అసలైతే దర్శకుడు పరశురామ్ గీత గోవిందం సినిమాకు అద్భుతమైన పాటలను అందించిన గోపి సుందర్ ని సెట్ చేసుకుందాం అనుకున్నాడు కానీ మహేష్ పట్టుబట్టి థమన్ ని సెలెక్ట్ చేసుకున్నాడు.
అయితే ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా కీలకమని ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ తొ పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుందట. అందుకే మహేష్ థమన్ ని సెలెక్ట్ చేసుకున్నాడట. గోపిసుందర్ అయితే మహేష్ స్థాయికి తగ్గట్టుగా ఇవ్వలేరని థమన్ ని ఎంచుకున్నారట.
ఇక ఇప్పటికే థమన్ సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ కోసం ఒక ట్యూన్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మరో రెండు ట్యూన్స్ కూడా రెడీ చేస్తున్నాడట. దర్శకుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫుల్ ఆల్బమ్ ని వీలైనంత త్వరగా ఫీనిష్ చేయాలని థమన్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.