Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘ఫిదా’ సాంగ్ సంచలన రికార్డ్... 150 మిలియన్స్!
వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శతక్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించి 'ఫిదా' మూవీ గతేడాది విడుదలై బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. కేవలం సినిమా మాత్రమే కాదు... యూట్యూబ్లో ఈ మూవీ సాంగ్స్ కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.
ఫిదాలోని.... "వచ్చిండే పిల్లా మెల్లగా వచ్చిండే..' పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కేవలం ఒక్క యూట్యూబ్లోనే ఇప్పటి వరకు 150 మిలియన్ల (15 కోట్లు) వ్యూస్ సొంతం చేసుకుంది. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ పాటకు ఇంత రెస్పాన్స్ రాలేదు. దీనికి సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించగా.... మధుప్రియ, రాంకీ పాడారు. శర్తికాంత్ కార్తీక్ సంగీతం అందించారు.
తను దర్శకత్వం వహించిన సినిమాలోని ఈ పాటకు ఇంత ఆదరణ లభించడంపై శేఖర్ కమ్ముల ఫేస్ బుక్ ద్వారా రియాక్ట్ అయ్యారు. '150 మిలియన్ మార్క్ను దాటిన తొలి తెలుగు పాట ఇదే .. దీన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు థాంక్స్. ఈ మ్యాజిక్లో భాగమైన 'ఫిదా' టీమ్ కి శుభాకాంక్షలు' అని ఆయన పోస్ట్ చేశారు.
'ఫిదా' చిత్రాన్ని అందమైన ప్రేమకథ చిత్రంగా శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. అమెరికాలో సెటిలైన ఆంధ్ర అబ్బాయి, తెలంగాణ అమ్మాయి నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.