Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మెగా మేనల్లుడి ఉప్పెన: అంచనాలు పెంచేసిన ఫస్ట్ సాంగ్..
మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. 'ఉప్పెన' సినిమాతో తెరంగేట్రం చేయబోతున్న ఆయన.. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా 'ఉప్పెన' మూవీ నుంచి మొదటి పాటను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
''నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం.. నీ నవ్వు ముత్యాల హారం.. నన్ను తీరానికి లాగేటి దారం దారం.. నల్లనైన ముంగురులే అల్లరేదో రేపాయిలే.. నువ్వు తప్ప నాకింక వేరే లోకాన్ని లేకుండా కప్పాయిలే'' అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంటోంది. జావేద్ అలీ పాడిన ఈ పాటలో శ్రీమణి లిరిక్స్ మ్యూజిక్ లవర్స్ మనసు దోచుకుంటున్నాయి.
ఈ పాటకు దేవీ శ్రీ అందించిన బాణీలు మరోసారి అందరినీ కట్టిపడేశాయి. గజల్స్ మిక్స్ చేసి దేవీ శ్రీ తనదైన మ్యాజిక్ చేశాడు. ఇకపోతే ఈ పాటలో హీరోహీరోయిన్లు వైష్ణవ్ తేజ్- కృతి శర్మ నాచురల్ లుక్ లో తెగ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది.
సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఉప్పెన' సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వైష్ణవ్ తేజ్ సరసన కృతి శర్మ నటిస్తోంది. వైష్ణవ్ తేజ్ జాలరిగా కనిపించనుండటం విశేషం. ఇప్పటికే రిలీజ్ అయిన ఉప్పెన అప్డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.