Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘తెల్లవారితే గురువారం ప్రమోషన్ జోరు.. విజయ దేవరకొండ రంగంలోకి
తెల్లవారితే గురువారం అనే సినిమాపై ఇండస్ట్రీలో మంచి హైప్ క్రియేట్ ఏర్పడుతోంది. తెల్లవారితే గురువారం సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి సింహ కోడూరి, చిత్ర శుక్ల, మిష నారంగ్, సత్య అక్కల, వైవా హర్ష, రాజీవ్ కనకాల, అజయ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మణికాంత్ జెల్లీ వహించారు. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని కలిసి నిర్మించారు. సంగీతం కాల భైరవ అందించారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రాజమౌళి, ఎన్టీఆర్లను తీసుకురాబోతోన్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
కీరవాణి తనయులిద్దరూ మళ్లీ ఈ సినిమాతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా కదిలి వచ్చాడు. తెల్లవారితే గురువారం అనే మూవీ నుంచి మొదటి సాంగ్ను విజయ్ దేవరకొండ తాజాగా విడుదల చేశాడు. ఈ మేరకు విజయ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా మెల్లిగా మెల్లిగా అనే పాటను వదిలాడు.
నా సోదరులు సింహ కోడూరి, కాళ భైరవలకు విజయం చేకూరాలి.. మార్చి 27న రాబోతోన్న తెల్లవారితే గురువారం సినిమా సక్సెస్ అవ్వాలని చిత్రయూనిట్కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. మార్చి 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా.. దానికి రాజమౌళి, ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా రాబోతోన్నారు.