Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
‘పైసా మే హీ పరమాత్మా’ అంటోన్న మంచు విష్ణు: కాజల్తో కలిసి అలా వస్తున్నాడు
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించాడు హీరో మంచు విష్ణు. ఆరంభంలోనే పలు పరాజయాలను చవి చూసిన అతడు.. ఆగకుండా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే 'ఢీ' అనే సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత 'దేనికైనా రెడీ', 'దూసుకెళ్తా' వంటి ఓ మోస్తరు విజయాలను అందుకున్న అతడు.. భారీ హిట్ కోసం పరితపిస్తున్నాడు. ఇందుకోసం జయాపజయాలతో సంబంధం లేకుండా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. ఇందులో భాగంగానే తాజాగా 'మోసగాళ్లు' అనే థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు.
మంచు విష్ణు హీరోగా నటిస్తూ ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై నిర్మిస్తోన్న థ్రిల్లర్ మూవీ 'మోసగాళ్లు'. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇందులో మంచు విష్ణు సోదరి పాత్రలో నటిస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి జెఫ్రీ గీచిన్ దర్శకుడు. ఇందులో రుహి సింగ్ హీరోయిన్గా చేస్తున్నారు. ఎన్నో రోజులుగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ.. బ్లాక్ మనీ నేపథ్యంతో సాగతుందని తెలుస్తోంది. విష్ణు కెరీర్లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ లిరికల్ సాంగ్ విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఇప్పటి వరకు 'మోసగాళ్లు' నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ క్రమంలోనే తాజాగా 'పైసా మే హీ పరమాత్మా' అంటూ సాగే పాటను విడుదల చేశారు. సిరాశ్రీ రాసిన ఈ పాటను లవిత లోబో ఆలపించారు. సామ్ సీఎస్ సంగీతం సమకూర్చాడు. అర్థవంతంగా సాగిన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక, ఈ సినిమాలో నవీన్ చంద్ర, సునీల్ శెట్టి, నవదీప్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా మార్చి19న ప్రేక్షకుల ముందుకు రానుంది.