‘యాత్ర’ ఫస్ట్సాంగ్: వైఎస్ఆర్ జ్ఞాపకాల్లోకి వెళ్లిన అభిమానులు
దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా 'యాత్ర' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నేడు (సెప్టెంబర్ 2) వైఎస్ఆర్ 9వ వర్దంతి సందర్బంగా 'యాత్ర' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు.
'నీ కనులలో కొలిమై.. రగిలే కలేదో' అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన లిరిక్స్ వైఎస్ఆర్ అభిమానులను మహానేత జ్ఞాపకాల్లోకి వెళ్లేలా చేశాయి. ఈ చిత్రానికి ఈ చిత్రానికి కె (కృష్ణ కుమార్) సంగీతం అందించగా... కాలబైరవ ఈ పాటను పాడారు
మహి.వి రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి టీజర్ విడుదల తర్వాత అంచనాలు మరింత పెరిగాయి.

మమ్ముట్టిని చూస్తుంటే అచ్చం వైఎస్ఆర్ను చూసినట్లే ఉందని, ఆయన రూపం, నడక, బాడీ లాంగ్వేజ్ జన నేతను గుర్తు చేస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావడానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 60 రొజుల్లో 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ పాద్రయాతను ప్రధానంగా ఫోకస్ చేస్తూ 'యాత్ర' సినిమా ఉంటుంది.


Click it and Unblock the Notifications











