Don't Miss!
- Sports SRH vs RCB: ఆ రెండు తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: ప్యాట్ కమిన్స్
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘యాత్ర’ ఫస్ట్సాంగ్: వైఎస్ఆర్ జ్ఞాపకాల్లోకి వెళ్లిన అభిమానులు
దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా 'యాత్ర' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నేడు (సెప్టెంబర్ 2) వైఎస్ఆర్ 9వ వర్దంతి సందర్బంగా 'యాత్ర' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు.
'నీ కనులలో కొలిమై.. రగిలే కలేదో' అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన లిరిక్స్ వైఎస్ఆర్ అభిమానులను మహానేత జ్ఞాపకాల్లోకి వెళ్లేలా చేశాయి. ఈ చిత్రానికి ఈ చిత్రానికి కె (కృష్ణ కుమార్) సంగీతం అందించగా... కాలబైరవ ఈ పాటను పాడారు
మహి.వి రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి టీజర్ విడుదల తర్వాత అంచనాలు మరింత పెరిగాయి.
మమ్ముట్టిని చూస్తుంటే అచ్చం వైఎస్ఆర్ను చూసినట్లే ఉందని, ఆయన రూపం, నడక, బాడీ లాంగ్వేజ్ జన నేతను గుర్తు చేస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావడానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 60 రొజుల్లో 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ పాద్రయాతను ప్రధానంగా ఫోకస్ చేస్తూ 'యాత్ర' సినిమా ఉంటుంది.