Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
టెర్రిఫిక్ ఫీడ్బ్యాక్: గంటల్లోనే మహేష్ బాబు ‘మహర్షి’ సంచలనం!
Recommended Video
మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఆయన లేటెస్ట్ మూవీ 'మహర్షి' టీజర్కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. ఉదయం 9.09 గంటలకు టీజర్ విడుదల చేయగా... కొన్ని గంటల్లో 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ సొంతం చేసుకుంది. చిత్ర నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించింది.
మహేష్ బాబు సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో మరోసారి రుజువైనట్లయింది. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా మహేష్ బాబు లుక్ చూసి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సినిమాలో ఏముంటుందో తెలియదు కానీ... ఆయన్ను అలా స్క్రీన్ మీద చూస్తూ ఉండిపోవచ్చు అనేంతగా మహేష్ బాబు అందం ప్రేక్షకులను కట్టిపడేసింది.
|
1 మిలియన్ డిజిటల్ వ్యూస్
కొన్ని గంటల్లోనే టీజర్కు ఇంత రెస్పాన్స్ రావడంతో... చిత్ర నిర్మాతల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ మూవీ నిర్మాణ సంస్థల్లో ఒకటైన దిల్ రాజు నేతృత్వంలోని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఈ హ్యాపీ మూమెంట్స్ను ట్విట్టర్ ద్వారా పంచుకుంది.
|
‘రిషి'గా నా జర్నీ మొదలైందని చెప్పిన మహేష్ బాబు
ఈ రోజు నుండి రిషిగా నా జర్నీ మొదలైంది. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి, ప్రేమకు దాసోహం అయ్యాను అని మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ మరింత ఎక్కువ
మహేష్ బాబు కెరీర్లో ఇది 25వ చిత్రం. సూపర్ స్టార్ ఇప్పటి వరకు చేసిన సినిమాలను మించిపోయేలా, ఒక గొప్ప ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుందనే అంచనాలు అభిమానుల్లో ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ వారి అంచనాలను మరింత పెంచింది.
కాలేజ్ స్టూడెంట్, రైతు బిడ్డగా
ఈ చిత్రంలో మహేష్ బాబు రెండు డిఫరెంట్ షేట్స్లో కనిపించబోతున్నారు. కాలేజ్ స్టూడెంట్.... రైతుబిడ్డగా ప్రేక్షకులకు వినోదం పంచబోతున్నారు. ఇప్పటి వరకు తన కెరీర్లో చేసిన పాత్రలన్నింటికంటే ది బెస్ట్గా ఇందులో మహేష్ బాబు పాత్ర ఉంటుందట.
మహర్షి
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అల్లరి నరేష్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానకి కేయూ మోహనన్ సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు. వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వై జయంతి మూవీస్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2019 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.