మహేష్ '1' గురించి కొన్ని వాస్తవాలు
హైదరాబాద్ : భారీ వ్యయంతో రూపొందుతున్న '1'లో మహేష్బాబు సరసన కృతిసనన్ నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లెంగ్త్ బాగా తక్కువ ఉండబోతోందంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ చిత్రం ఫస్టాఫ్ 70 నిముషాలు, సెకండాఫ్ 60-65 నిముషాలు వరకూ ఉండబోతోందని విశ్వసనీయ సమాచారం.
అలాగే ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ పక్కా కమర్షియల్ ప్యాకెడ్ గా సుకుమార్ డిజైన్ చేసారు. సెకండాఫ్ కొద్దిగా సెంటిమెంట్ తో కూడిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతోంది. అయితే కామెడీ సినిమాలో బాగా తక్కువగా ఉండబోతోందని వినికిడి. సబ్జెక్ట్ సీరియస్ గా ఉండటంతో స్పెషల్ గా కామెడీకి స్పేస్ తక్కువని చెప్తున్నారు. ఇక ఆడియో విడుదల అయ్యాక సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ముంబైలో తీద్దామనుకున్న బ్యాలెన్స్ పాటని,ఇక్కడే రామోజీ ఫీల్మ్ సిటిలో ఈ నెల 15 నుంచి తీయబోతున్నారు. జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. డిసెంబరు ద్వితీయార్ధంలో పాటల్ని విడుదల చేయబోతున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. ''యాక్షన్, వినోదాంశాలతో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. భిన్నమైన నేపథ్యంలో సాగుతుంది. ఇందులో మహేష్బాబు కనిపించే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది''అన్నారు. అలాగే ఈ సినిమాతో మహేష్బాబు తనయుడు గౌతమ్కృష్ణ తెరంగేట్రం చేయబోతున్నాడు. చిన్నప్పటి మహేష్బాబుగా గౌతమ్ కనిపిస్తాడని తెలుస్తోంది. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఇటీవల రామోజీ ఫిల్మ్సిటీలో పతాక సన్నివేశాలను తెరకెక్కించారు. దీంతో టాకీభాగం పూర్తయింది.

ఈ చిత్రం ఆడియో ఘనంగా చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 14న ఆడియో పంక్షన్ డేట్ ఫిక్స్ చేసారని సమాచారం. దాదాపు అన్ని తెలుగు ఛానెల్స్ లో ఒకేసారి ఈ చిత్రం ఆడియో టెలీకాస్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పెద్ద సిటీలు,టౌన్స్ లో పెద్ద స్క్రీన్స్ పై ఈ ఆడియోని లైవ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చెస్తున్నట్లు వినికిడి. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ సమయంలో ఇంట్రాక్ట్ అయ్యేలా చూస్తారు.
14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనన్ హీరోయిన్. సుకుమార్ దర్శకుడు. గోవా షెడ్యూల్తో చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్టే. అక్కడే షూటింగ్ పూర్తికావటంతో గుమ్మిడికాయ కొడతారని సమాచారం. ఇక డిసెంబరులో నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించుకొని సంక్రాంతి పండగ నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. 'జనవరి 10న '1'ని తెచ్చేస్తున్నాం' అని మహేష్ కూడా చెప్పేశాడు. మహేష్కి సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది 'ఒక్కడు', 'బిజినెస్మేన్', 'సీతమ్మ వాకిట్లో' ముగ్గుల పండక్కి విడుదలై విజయాన్ని సాధించాయి. ఇప్పుడు '1' కూడా పండగ బరిలో దిగబోతోంది.
అలాగే ఈ చిత్రంలో కృతిసనన్ ఓ టీవీలో న్యూస్ రీడర్గా పని చేస్తోంది. ఇందుకోసం ఆమె ఏవో వార్తలు చదువటాన్ని మొన్నా మధ్య రామోజీఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో షూట్ చేసారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఛాయాగ్రహణం: రత్నవేలు, పోరాటాలు: పీటర్ హెయిన్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి కోటి.


Click it and Unblock the Notifications











