Don't Miss!
- News రుణమాఫీపై రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నా: హరీష్ రావు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
వారసులు వారసులు ఒకటి! రేపు అఖిల్ కూడా అతన్ని వాడుకుంటాడు!
హైదరాబాద్: నిజమే...వారసులు వారసులు ఒకటి. ఇండస్ట్రీలో పైకి రావాలంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం తప్పనిసరి. అందుకే మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ నటించిన '100 డేష్ ఆఫ్ లవ్' సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంటే తనవంతు సహకారం అదించాడు అక్కినేని వారసుడు అఖిల్.
ఎవర్ గ్రీన్ పెయిర్ దుల్కర్ సల్మాన్, నిత్యమీనన్ జంటగా రానున్న 100డేస్ ఆఫ్ లవ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఆడియో విడుదల చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు స్పీడప్ చేసారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్ల కోస ప్రత్యేకంగా వీడియో షూట్ చేసారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో అఖిల్ కూడా కనిపించడం చూసి అంతా ఆశ్చర్య పోయారు.
అయితే తెలుగునాట అఖిల్ కు మంచి ఫాలోయింగ్ ఉండటంతో అతను కూడా ప్రమోషన్స్ లో పాల్గొని సపోర్టు ఇస్తే రెస్పాన్స్ బావుంటుందనే ఉద్దేశ్యంతో ఇలా చేసారు. రేపు అఖిల్ సినిమాలు మళయాలంలో రిలీజ్ అయితే అఖిల్ కూడా దుల్కర్ సల్మాన్ ను ఇలానే వాడుకోడా ఏంటి? ఎంతైనా వారసులు వారసులు ఒకటి.
100 డేస్ ఆఫ్ లవ్
జీనస్ ముహ్మద్ దర్శకత్వంలో, SSC మూవీస్ సమర్పణలో , ఎస్. వెంకటరత్నం నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం మలయాళం లో ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే.
నిత్యా మీనన్ మేనేజర్
తెలుగులోనూ అంతటి ఘన విజయాన్ని సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్. ఆల్రెడీ రిలీజ్ డేట్ ను కన్ఫార్మ్ చేసుకున్న ఈ సినిమాతో నిత్య మీనన్ తన మేనేజర్ అయిన వెంకట్ ను ప్రొడ్యూసర్ గా పరిచయం చేస్తున్న ఈ సినిమాపై నిత్య బాగానే కేర్ తీసుకుంటుంది.
ప్రమోషన్స్
ఇప్పటికే మంచి ఊపు మీదున్న ప్రమోషన్స్ లో నిత్యా మీనన్, దుల్కర్ సల్మాన్ తో పాటు అఖిల్ కూడా పాల్గొనడం తెలుగు మీడియాలో హాట్ టాపిక్ అయింది.
ఓకే బంగారంతో
ఓకే బంగారం సినిమాతో యూత్ ని కట్టిపడేసిన ఈ జంట, ఈ సినిమాతో అందరికీ మరింత చేరువ కానున్నారు. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలే ఉన్నాయి.
రిలీజ్ డేట్
ఇప్పటికే ఆడియో విడుదల చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ నిర్ణయించారు.
అక్కడ హిట్
మళయాలంలో ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
ప్రెస్ మీట్ వీడియో
ప్రెస్ మీట్ వీడియో