twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    '1940లో ఒక గ్రామం' చిత్రానికి రూ. 30 లక్షల ప్రోత్సాహం

    By Srikanya
    |

    బాలాదిత్య, శ్రీ జంటగా నరసింహ నంది దర్శకత్వం వహించిన సినిమా "1940లో ఒక గ్రామం" జాతీయ అవార్డు పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల రూపాయల ప్రత్యేక ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర చలనచిత్ర, టివి అభివృద్ధి సంస్థ నుంచి ఈమొత్తాన్ని చిత్ర నిర్మాతకు అందించనున్నట్టు పేర్కొన్నారు. ఇక ఈ చిత్రం 1940 కాలంలోని పల్లెలోని ఓ బ్రహ్మణ కుటుంబంలో కధగా ఈ చిత్రం జరుగుతుంది. కథలో ధనికుడైన ముసలి బ్రాహ్మణుడు దీక్షుతులు (ముక్కురాజు)తో చాలా రెట్లు చిన్నది అయిన సుశీల (శ్రీ రమ్య) పెళ్ళి జరుగుతుంది. వివాహానంతంరం కొత్త జీవితంలోకి ఎన్నో ఆశలతో అడుగు పెట్టిన ఆమెకు కాలు కూడా కదపలేని ముసలి భర్త తో నిరాశ ఎదురువుతుంది.

    ఆ క్రమంలో కష్టాలు తీర్చమని పూజ చేయడానికి గోదావరి ఒడ్డుకు వెళ్ళిన సుశీలకి తన వయస్సు వాడైన దళిత కులానికి చెందిన సూరి (బాలాదిత్య) తో పరిచయం ఏర్పడి..అది పరిణయానికి..అక్కడనుంచి సహజీవనానికి దారి నేస్తుంది. సూరితో సుశీల తల్లికాబోతోందన్న విషయం తెలుసుకున్న అగ్రహారం వారు ఆమెకు గుండె గీయించి ఓ చీకటి గదిలో బంధించి సూరిని ఊరు నుంచి వెలేస్తారు. ఆ తరువాత సూరి బ్రాహ్మణుడిగా ఎలా మారాడు, దీక్షితుడులో బుద్ది ఎలా వచ్చిందనేది మిగతా కథగా సాగుతుంది. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రం హక్కులు తీసుకుని విడుదల చేసిన ఈ చిత్రం కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. ఈ చిత్రం తర్వాత నరసింహ నంది..హైస్కూల్ అనే చిత్రాన్ని తీసాడు. తన టీచర్ తోనే ప్రేమలో పడే కథతో ఈ చిత్రం రూపొందింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X