Don't Miss!
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
2.0 అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది: హాట్ కేకుల్లా మాయం, ఉదయం 4 గంటలకే...
Recommended Video
ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ మూవీ 2.0 మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్తో శంకర్ రూపొందించిన ఈ విజువల్ వండర్ చూసేందుకు సినీ అభిమానులంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
తమిళ, హిందీ, తెలుగు భాషల్లో సినిమా విడుదలవుతుండగా... అన్నింటికంటే ముందుగా బెంగుళూరులో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి. టికెట్స్ అందుబాటులోకి వచ్చిన కొన్ని నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
ఉదయం 4 గంటల నుంచే షోలు
బెంగుళూరులో కొన్ని థియేటర్లలో ఉదయం 4 గంటల నుంచే ‘2.0' షోలు వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కర్నాటకలోనే పరిస్థితి ఇలా ఉందంటే... రజనీకాంత్ను దేవుడుగా ఆరాధించే తమిళనాడు పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కర్నాటక వ్యాప్తంగా 300 స్క్రీన్లలో రజనీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.
తుడిచి పెట్టుకుపోయిన బాహుబలి 2 రికార్డ్.. రజని 2.0మానియా!
హిందీలోనూ భారీ క్రేజ్
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తుండటంతో హిందీలోనూ ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. హిందీ మార్కెట్ పెద్దది కావడంతో ఇక్కడి నుంచే ఎక్కువ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇండియా మొత్తం 10 వేల స్క్రీన్లలో
2.0 చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కలిసి ఇండియా వ్యాప్తంగా తొలి రోజు 10 వేల స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో దాదాపు 1500 వరకు 3డి స్క్రీన్లు ఉన్నట్లు తెలుస్తోంది.
విదేశాల్లోనూ భారీ రిలీజ్
ఈ చిత్రాన్ని ఇండియన్స్ స్థిరపడ్డ ఇతర దేశాల్లోనూ భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో రజనీకాంత్కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జపాన్, కొరియాతో పాటు చైనా, లాటిన్ అమెరికా దేశాల్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
2150 వి.ఎఫ్.ఎక్స్ షాట్స్
ఈ చిత్రాన్ని విజువల్ వండర్గా తీర్చిదిద్దడానికి 2150 వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ ఉపయోగించారు. 3000 మంది వి.ఎఫ్.ఎక్స్ టెక్నీషియన్స్.. 1000 టిపికల్ వి.ఎఫ్.ఎక్స్ షాట్ మేకర్స్ ఈ సినిమా కోసం పనిచేశారు.
త్రీడీ టేకింగ్, 4డీ సౌండింగ్
ఇటీవల ఈ చిత్రం గురించి డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ - ``సూపర్స్టార్ రజనీకాంత్ గారితో నేను చేస్తున్న మూడో సినిమా `2.0`. పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్. సినిమా అనేదాన్ని కూడా దాటి... త్రీడీ టేకింగ్, 4డీ సౌండింగ్ అనే కొత్త అనుభవాన్ని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. రెహమాన్గారు, రసూల్ పూకుట్టి కొత్త సౌండింగ్ టెక్నాలజీని ఈ చిత్రంతో పరిచయం చేస్తున్నారు. ఇలాంటి గొప్ప సినిమాను మనం చేయగలం అని నిరూపించాం. నిర్మాత సుభాష్ కరణ్ సుభాష్ కరణ్ లేకపోతే ఈ సినిమా లేదు. ఇండియన్ సినిమాను ఇంత బడ్జెట్ తో ఎవరూ నిర్మించరు. ఆయన అందించిన ప్రోత్సాహంతో పాటు సూపర్స్టార్ రజనీకాంత్ అందించిన తోడ్పాటుతో గొప్ప అనుభూతిని ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం`` అన్నారు.