twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ కంపెనీ పెద్ద షాకిచ్చింది, అందుకే 2.0 బడ్జెట్ పెరిగింది: శంకర్

    |

    Recommended Video

    Robo 2.O Movie Press Meet : Rajinikanth Reveals Baahubali Success Secret

    సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం '2.0'. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది.

    ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను ఎన్‌.వి.ఆర్‌. సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ దిల్ రాజుతో కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రెస్ మీట్‌కు రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా మీడియారు అడిగిన ప్రశ్నలకు వారు ఓపికగా సమాధానాలు ఇచ్చారు.

    షూటింగ్ చివరి దశకు వచ్చే సరికి శంకర్ మొహంలో చాలా టెన్షన్ కనిపించింది అని రజనీకాంత్ అంటున్నారు. మీరు ఎందుకు టెన్షన్ పడ్డారు? మొదట మీరు అనుకున్న బడ్జెట్ ఎంత? సినిమా పూర్తయ్యే సమయానికి బడ్జెట్ పెరిగింది కాబట్టి టెన్షన్ ఫీలయ్యారా? అనే ప్రశ్నకు శంకర్ స్పందిస్తూ అసలు విషయం తెలిపారు.

     వారు ప్రామిస్ నిలబెట్టుకోలేదు

    వారు ప్రామిస్ నిలబెట్టుకోలేదు

    ఈ సినిమా మేము గత సంవత్సరమే రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశాము. కానీ ఒక విఎఫ్ఎక్స్ కంపెనీ రిలీజ్‌కు రెండు నెలల ముందు సినిమా డెలివరీ చేస్తామని ప్రామిస్ చేశారు. కానీ డేట్ దగ్గరకు వచ్చిన తర్వాత మాకు ఇంకా ఆరు నెలలు కావాలి అనడంతో సినిమా రిలీజ్ వాయిదా వేశాం.

    ఆ సమయంలో విషయం చెప్పడంతో షాకయ్యాం

    ఆ సమయంలో విషయం చెప్పడంతో షాకయ్యాం

    గతేడాది దుబాయ్‌లో ఫంక్షన్ చేసే సమయంలో ఆ విఎఫ్ఎక్స్ కంపెనీ వారు మాకు షాకింగ్ విషయం చెప్పారు. ఇంకా సినిమా గ్రాఫిక్స్ రెడీ అవ్వలేదు, మరో సంవత్సరం కావాలి అన్నారు. దాంతో మేమంతా షాకయ్యాం.

    అపుడు ఏమీ చేయలేని పరిస్థితి మాది

    అపుడు ఏమీ చేయలేని పరిస్థితి మాది

    ఆల్రెడీ ఆడియో రిలీజ్ ప్రోగ్రాం అంతా రెడీ అయిన తర్వాత చెబితే మేము ఏమి చేయలేని పరిస్థితి. ఆ టెన్షన్లోనే ఆడియో రిలీజ్ జరిగింది. ఆ కంపెనీకి ఇలాంటి హెవీ విఎఫ్ఎక్స్ హ్యాండిల్ చేయడం కష్టం అని తర్వాత తెలిసింది. వెంటనే ఆ కంపెనీ నుంచి అన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ బయటకు తీసి ఆ కంపెనీ కంటే పెద్ద కంపెనీకి ఇస్తే బాగా వస్తుంది... లేకపోతే పాడైపోతుంది అని అని ఫీలయ్యాం.

    అందుకే బడ్జెట్ పెరిగింది

    అందుకే బడ్జెట్ పెరిగింది

    అపుడు నేను టెన్షన్ పడ్డ విషయాన్నే రజనీకాంత్ చెప్పారు. వేరే కంపెనీకి ప్రాజెక్ట్ అప్పగించడం వల్ల బడ్జెట్ ఎక్కువైంది. కానీ ఇపుడు నాకు సినిమా ఔట్ పుట్ వచ్చిన తీరు చాలా సంతృప్తికరంగా ఉంది అని శంకర్ తెలిపారు.

    English summary
    2.0 movie Hyderabad Press Meet LIVE: Director Shankar about movie VFX Issue. 2.0 is an upcoming Indian science fiction action film written and directed by S. Shankar, co-written by B. Jeyamohan, and produced by A. Subaskaran. The film serves as a spiritual successor to Enthiran (2010), featuring Rajinikanth, who reprises the roles of Dr. Vaseegaran and Chitti, alongside Akshay Kumar and Amy Jackson.[6] With an estimated budget of ₹543 crore,[4] it is the most expensive Indian film made to date.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X