Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాలయ్య సాహసానికి 25 ఏళ్ళు.. ఒకేరోజు రెండు సినిమాలు విడుదల, అప్పట్లో బ్లాక్ బస్టర్!
Recommended Video
నందమూరి బాలకృష్ణ సత్తాని బాక్స్ ఆఫీస్ వద్ద తెలియజేసిన చిత్రాలు చాలా ఉన్నాయి. అదే సమయంలో బాలయ్య సాహసోపేత నిర్ణయాలు సైతం తీసుకుంటున్నారు. ఒకే హీరో నటించిన రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కావడం చాలా అరుదు అని చెప్పొచ్చు. చరిత్రలో ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే వెతుక్కోవాల్సిందే. కానీ ఆ అనుభవం బాలయ్యకు ఎదురైంది. బాలయ్య సరిగ్గా పాతికేళ్ల క్రితం ఇదే రోజు బాలయ్య నటించిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు చిత్రాలు సెప్టెంబర్ 3, 1993 న విడుదలయ్యాయి. ఇది అప్పట్లో పెద్ద సాహసం.
స్టార్ హీరోగా
బాలయ్య స్టార్ హీరోగా టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. అలాంటి సమయంలో ఒకే రోజు తాను నటించిన రెండు సినిమాలు విడుదల కావడం అంటే అత్యంత సాహసోపేతమైన నిర్ణయం. తప్పని పరిస్థితుల్లో ఆ రెండు చిత్రాలని ఒకే రోజు విడుదుల చేయాల్సి వచ్చింది.
నిప్పురవ్వ
కోదండ రామిరెడ్డి అప్పటికే స్టార్ డైరెక్టర్. బాలయ్య కూడా జోరు మీద ఉన్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో నిప్పురవ్వ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని సింగరేణి బొగ్గు కార్మికుల నేపథ్యంలో రూపొందించారు. ఆ సమయంలో ప్రమాదం సంభవించడంతో కోర్టు నుంచి ఈ చిత్రానికి విడుదల సమస్యలు ఎదురయ్యాయి.
భారీ బడ్జెట్
నిప్పురవ్వ చిత్రం అప్పట్లోనే టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. తప్పని పరిస్థితుల్లో బాలయ్య నటించిన మరో చిత్రం బంగారు బుల్లోడు సినిమాతో ఈ చిత్రాన్ని పోటీగా ఒకేరోజు విడుదల చేయవలసి వచ్చింది. నిప్పురవ్వ చిత్రంలో విజయశాంతి హీరోయిన్.
బంగారు బుల్లోడు
బంగారు బుల్లోడు చిత్రం రవి రాజా పినిశెట్టి దర్శత్వంలో రూపొందింది. ఈ చిత్రంలో రమ్య కృష్ణ, బాలీవుడ్ భామ రవీనా టాండన్ హీరోయిన్లుగా నటించారు. బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా బంగారు బుల్లోడు చిత్రం నిలిచింది. నిప్పురవ్వ చిత్రం మాత్రం నిరాశ పరిచింది.
చాలా అరుదు
ఇలా ఒక హీరో నటించి రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కావడం చాలా అరుదుగా జరిగే అంశం. మూడేళ్ళ క్రితం నేచురల్ స్టార్ నాని నటించిన జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రాలు ఒకేరోజు విడుదలయ్యాయి.