Don't Miss!
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
ఆగష్టు చివరికి ముగ్గరు రాస్కెల్స్..!?
హిందీలో సంచలన విజయం సాధించిన 'త్రీ ఇడియేట్స్' సినిమాని ప్రముఖ దర్శకుడు శంకర్ తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'నన్బన్' పేరుతో జెమిని ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్, జీవా, శ్రీకాంత్ (శ్రీరాం) హీరోలుగా, ఇలియానా హీరోయిన్ గా నటిస్తున్నారు.
దర్శకుడు యస్.జె.సూర్య ఓ కీలక పాత్రలో కనిపిస్తాడు. సత్యరాజ్ ప్రొఫసర్ పాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. శంకర్ కి టాలీవుడ్ లో వున్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని తెలుగులో 'త్రీ రాస్కేల్స్' పేరుతో దీనిని తెలుగు నాట రిలీజ్ చేస్తారు. వచ్చే నెలాఖరుకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హరీష్ జయరాజ్ మ్యూజిక్ కంపోజింగ్ చేస్తున్నారు. 'రోబో' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వస్తున్న శంకర్ సినిమా కాబట్టి ఈ ప్రాజక్టుకి చాలా క్రేజ్ వచ్చింది.