twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆగష్టు చివరికి ముగ్గరు రాస్కెల్స్..!?

    By Sindhu
    |

    హిందీలో సంచలన విజయం సాధించిన 'త్రీ ఇడియేట్స్' సినిమాని ప్రముఖ దర్శకుడు శంకర్ తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'నన్బన్' పేరుతో జెమిని ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్, జీవా, శ్రీకాంత్ (శ్రీరాం) హీరోలుగా, ఇలియానా హీరోయిన్ గా నటిస్తున్నారు.

    దర్శకుడు యస్.జె.సూర్య ఓ కీలక పాత్రలో కనిపిస్తాడు. సత్యరాజ్ ప్రొఫసర్ పాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. శంకర్ కి టాలీవుడ్ లో వున్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని తెలుగులో 'త్రీ రాస్కేల్స్' పేరుతో దీనిని తెలుగు నాట రిలీజ్ చేస్తారు. వచ్చే నెలాఖరుకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హరీష్ జయరాజ్ మ్యూజిక్ కంపోజింగ్ చేస్తున్నారు. 'రోబో' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వస్తున్న శంకర్ సినిమా కాబట్టి ఈ ప్రాజక్టుకి చాలా క్రేజ్ వచ్చింది.

    English summary
    Contrary to earlier reports that Shankar's Nanban will grace theatres during this Christmas, the latest buzz is that the director is planning to release it by August end. Nanban, remake of the Bollywood blockbuster 3 Idiots, has Vijay, Srikanth and Jeeva in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X