Don't Miss!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్గా పరుగుల చిరుత.!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అమ్మ వెనక ఎవరో ఉన్నారు: 30 ఇయర్స్ పృథ్వి కేసుపై కొడుకు స్పందన!
30 ఇయర్స్ పృథ్వి కేసుపై ఆయన కొడుకు సాయి శ్రీనివాస్ స్పందించారు. నాన్నకు మద్దతుగా నిలిచారు. అమ్మ ఇలా చేస్తుందని ఊహించలేదన్నారు.
హైదరాబాద్: తెలుగు కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వికి విజయవాడ ఫ్యామిలీ కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. నెలకు రూ. 8 లక్షల చొప్పున భార్యకు భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా పృథ్వి కొడుకు సాయి శ్రీనివాస్ స్పందించారు.
30 ఇయర్స్ పృథ్వికి కోర్టు షాక్: నెలకు 8 లక్షల భరణం చెల్లించాల్సిందే!
గొడవలు ఉన్న మాట నిజమే కానీ... అమ్మ లీగల్ గా ప్రోసీడ్ అవుతుందని ఊహించలేదని ఆయన అన్నారు. తనను, చెల్లిని నాన్న ఎంతో బాగా చూసుకుంటారని తెలిపారు. గతంలో అందరం బాగానే ఉన్నాం..కానీ ఏడాది నుంచి ఏం మిస్ అండర్స్టాండింగ్స్ వచ్చాయో తనకు తెలియదు.. అప్పటి నుండి అమ్మకు, నాన్నకు, మాకు కూడా మనశ్శాంతి లేదని ఆయన తెలిపారు.
నాన్న ఆర్టిస్ట్గా ఎంతో కష్టపడి పైకొచ్చాడు. ఆయన ఎదుగుతున్న సమయంలో ఇలాంటి అలిగేషన్స్ రావడం విచారకరం. అమ్మను ఇలా చేయడంతో షాకయ్యాను. ఎవరి మాట వినో లీగల్గా ప్రోసీడ్ అయి ఉంటారు, అది నిజం కాకపోయి ఉంటే బాగుండేది. ప్రతి ఇంట్లో భార్యాభర్తల మధ్య జరిగే గొడవ లాగే వీరి మధ్య జరిగిందని తెలిపారు. మా అమ్మ వెనుక ఎవరో ఉండి ఇదంతా చేయిస్తున్నారని అనుకుంటున్నా. కోర్టు వివాదాన్ని కోర్టులోనే పరిష్కరించుకుంటామని సాయి శ్రీనివాస్ తెలిపారు.