Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అమ్మ వెనక ఎవరో ఉన్నారు: 30 ఇయర్స్ పృథ్వి కేసుపై కొడుకు స్పందన!
30 ఇయర్స్ పృథ్వి కేసుపై ఆయన కొడుకు సాయి శ్రీనివాస్ స్పందించారు. నాన్నకు మద్దతుగా నిలిచారు. అమ్మ ఇలా చేస్తుందని ఊహించలేదన్నారు.
హైదరాబాద్: తెలుగు కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వికి విజయవాడ ఫ్యామిలీ కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. నెలకు రూ. 8 లక్షల చొప్పున భార్యకు భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా పృథ్వి కొడుకు సాయి శ్రీనివాస్ స్పందించారు.
30 ఇయర్స్ పృథ్వికి కోర్టు షాక్: నెలకు 8 లక్షల భరణం చెల్లించాల్సిందే!
గొడవలు ఉన్న మాట నిజమే కానీ... అమ్మ లీగల్ గా ప్రోసీడ్ అవుతుందని ఊహించలేదని ఆయన అన్నారు. తనను, చెల్లిని నాన్న ఎంతో బాగా చూసుకుంటారని తెలిపారు. గతంలో అందరం బాగానే ఉన్నాం..కానీ ఏడాది నుంచి ఏం మిస్ అండర్స్టాండింగ్స్ వచ్చాయో తనకు తెలియదు.. అప్పటి నుండి అమ్మకు, నాన్నకు, మాకు కూడా మనశ్శాంతి లేదని ఆయన తెలిపారు.
నాన్న ఆర్టిస్ట్గా ఎంతో కష్టపడి పైకొచ్చాడు. ఆయన ఎదుగుతున్న సమయంలో ఇలాంటి అలిగేషన్స్ రావడం విచారకరం. అమ్మను ఇలా చేయడంతో షాకయ్యాను. ఎవరి మాట వినో లీగల్గా ప్రోసీడ్ అయి ఉంటారు, అది నిజం కాకపోయి ఉంటే బాగుండేది. ప్రతి ఇంట్లో భార్యాభర్తల మధ్య జరిగే గొడవ లాగే వీరి మధ్య జరిగిందని తెలిపారు. మా అమ్మ వెనుక ఎవరో ఉండి ఇదంతా చేయిస్తున్నారని అనుకుంటున్నా. కోర్టు వివాదాన్ని కోర్టులోనే పరిష్కరించుకుంటామని సాయి శ్రీనివాస్ తెలిపారు.