twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ సంచలనం.. చిరు, పవన్, త్రివిక్రమ్, జూ ఎన్టీఆర్, లోకేష్?

    |

    Recommended Video

    Lakshmi's NTR

    'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలై ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. 24 గంటల్లో 4 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ దేవుళ్ల ఆశీర్వాదం తమ సినిమాపై ఉండటం వల్లే ఇది సాధ్యమైందని, ఎన్టీ రామారావు కూడా పై నుంచి బ్లెస్ చేసినట్లు తెలిపారు.

    కాగా.. నిన్న ట్రైలర్ వదిలినప్పటి నుంచి రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో చేసిన హడావుడి కూడా చర్చనీయాంశం అవుతోంది. చంద్రబాబు, కేసీఆర్, మోడీ, రాహుల్ గాంధీ చివరకు డొనాల్డ్ డ్రంప్ కూడా తమ మూవీ ట్రైలర్ చూసినట్లు వర్మ కొన్ని ఫోటోలు షేర్ చేయడం గమనార్హం. చిరంజీవి, జూ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఫోటోలను కూడా తమ ట్రైలర్ పబ్లిసిటీకి వాడేశాడు.

    రాహుల్ గాంంధీ ఆలోచనలో పడ్డారా?

    లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ చూసిన తర్వాత రాహుల్ గాంధీ ఆలోచనలో పడ్డారా? అనే సందేహం వ్యక్తం చేస్తూ వర్మ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ జాతీయ స్థాయి రాజకీయాల్లో కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో వర్మ చేసిన కామెంట్ చర్చనీయాంశం అయింది.

    వైఎస్ జగన్

    వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘యాత్ర' దర్శకుడితో కలిసి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ చూస్తున్నట్లు వర్మ మరో పోస్టులో వెల్లడించడం గమనార్హం.

    ఈని గురించి నీకు ముందుగాలే చెప్పిన కదరా?

    ‘ఈని గురించి నీకు ముందుగాలే జెప్పినగదరా' అని లక్ష్మీస్ ఎన్టీఆర్ చూసిన తర్వాత కేసీఆర్.. కేటీఆర్‌కు చెప్పినట్లు ఉన్న పిక్ పోస్ట్ ఫన్ క్రియేట్ చేస్తోంది.

    వీడిని ఎక్కడో చూసినట్లు ఉంది

    ఈ ట్రైలర్‌లోని వీడిని ఎక్కడో చూసినట్లు ఉంది... అంటూ చంద్రబాబు పిక్‌తో ఆర్జీవీ తనదైన శైలిలో మరో కామెంట్ పెట్టారు.

    గుంటూరులో అదే చెప్పాను

    నేను గుంటూరు సభలో ఈ విషయమే చెప్పాను అని.. ప్రధాని మోడీ ఫోటోతో కూడిన ట్వీట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల మోడీ గుంటూరు సభలో చంద్రబాబు మీద విమర్శలు చేసిన నేపథ్యంలో వర్మ చేసిన ఈ ట్వీట్ చర్చనీయాంశం అయింది.

    జూ ఎన్టీఆర్-త్రివిక్రమ్

    జూ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ చూస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ మరో పోస్ట్ క్రియేట్ చేశారు.

    చిరు, పవన్

    చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ చూస్తున్నట్లు క్రియేట్ చేసిన పిక్ మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది.

    డొనాల్డ్ ట్రంప్ కూడా

    ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మత ప్రచారకుడు కెఏ పాల్... అమెరికా అధక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ట్రైలర్ పంపడంతో అతడు కూడా ఈ ట్రైలర్ వీక్షించినట్లు వర్మ ఫోటో క్రియేట్ చేశారు.

    మాయాబజార్

    మాయాబజార్ సినిమాను కూడా వర్మ వదల్లేదు. ఇలా రకరకాల పోస్టులతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ ట్రైలర్‌కు విపరీతంగా పబ్లిసిటీ పెంచే ప్రయత్నం చేశారు.

    English summary
    "4 million views in just 24 hours for #LakshmisNTRtrailer ..The Gods are really blessing our team ..We all thank you NTR." RGV tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X