Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
14 రోజుల్లో 4 భారీ సినిమాలు
ఏప్రిల్ 20 నుంచి మే 4 లోపు నాలుగు భారీ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాల బిజినెస్ 60 కోట్ల పై మాటే. ఈ వేసవి సినిమాల మీదే ఈ ఏడాది తెలుగు సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రభాస్- ఎంఎస్ రాజు సినిమా పౌర్ణమి ఏప్రిల్ 20న విడుదల కానుంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష, చార్మి, మధుశర్మ హీరోయిన్లుగా నటించారు. మహేష్బాబు- పూరీ జగన్నాధ్ల భారీ చిత్రం పోకిరి ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలున్నాయి. సినిమా రంగ ప్రముఖులు ఈ సినిమాకు సంబంధించి అనేక ప్రాంతాల ప్రదర్శన హక్కులను పొందారు. ఏప్రిల్ 29 ఉదయం బాలకృష్ణ సినిమా వీరభద్ర విడుదల కానుంది. ఇక పవన్ కళ్యాణ్ బంగారం సంగతి వేరే చెప్పనవసరం లేదు. సమ్మర్ సినిమాల్లో దీనికి వచ్చినంత పబ్లిసిటీ మరో సినిమాకు రాలేదు. ఈ సినిమా మే 4న విడుదల కానుంది. ఈ నాలుగు సినిమాల్లో రెండు మాత్రమే సూపర్హిట్ రేంజికి వెళ్తాయని, మిగితా వాటి భవిష్యత్తు అవి విడుదలైన తర్వాత కానీ తెలియదని సినిమా పండితులు చెబుతున్నారు.