Don't Miss!
- News గేదెల మందులమ్మేవాళ్లు వైసీపీకి సర్వే చేశారంట?
- Sports Rohit x Hardik: పదేళ్లుగా కెప్టెన్సీ చేశా.. ఎలా గెలవాలో తెలుసు- రోహిత్
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఈ రోజు ఏకంగా ఐదు సినిమాలు విడుదల
పోయిన వారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'పంజా' సినిమా భారీ అంచనాలతో విడులైన సంగతి తెలిసిందే. ఈ వారంలో ఏకంగ అరడజను సినిమాలు థియేటర్లపైకి దూకాయి. ఇప్పటికే హాలీవుడ్ డబ్బింగ్ సినిమా మిషన్ ఇంపాజబుల్4 తెలుగు అనువాద చిత్రం విడుదల కాగా...ఈ రోజు శర్వానంద నటించిన 'జర్నీ', ఉదయ్ కిరణ్-శ్వేతాబసు నటించిన 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా', ఆర్తీ అగర్వాల్ చిత్రం 'వన కన్య-వండర్ వీరుడు', శ్వేతామీనన్ నటించి 'రతినిర్వేదం', హారర్ నేపథ్యంలో సాగే 'దెయ్యం ఉందా?', దునియా చిత్రాలు విడుదలయ్యాయి.
మురుగదాస్ నిర్మించిన జర్నీ మూవీ ఇప్పటికే తమిళంలో ఎంగేయుమ్-ఎప్పోదుమ్ పేరుతో విడుదలై వంద రోజుల దిశగా దూసుకెలుతోంది. అదే విధంగా ఉదయ్ కిరణ్-శ్వేతాబసులు ఈ సినిమా ద్వారా మళ్లీ తెలుగు తెరపై తమ స్థానం సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. శ్వేతామీనన్ హాట్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ రతినిర్వేదంపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ ఐదు సినిమాల్లో బాక్సాఫీసు వద్ద సక్సెస్ అయ్యేది ఎవరో రెండు రోజుల్లో తేలిపోనుంది.