Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్: రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాట్లు కేక.. (ఫోటోలు)
ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన 'సాహో' ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్న డ భాషల్లో ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఆదివారం సాయంత్రం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.
'సాహో' చిత్ర బృందం ముంబై, బెంగుళూరు, చెన్నై ఇలా వివిధ ప్రాంతాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్, ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం హైదరాబాద్లో కనీ వినీ ఎరుగని రీతిలో జరుపుతున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు.
అభిమానులను ఆకర్షిస్తున్న 60 అడుగుల భారీ కటౌట్
'కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్' అనేది ప్రభాస్ పాపులర్ డైలాగ్. ‘సాహో' మూవీ ప్రమోషన్లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో 60 అడుగుల ఎత్తులో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంటులో పాల్గొనడానికి వస్తున్న అభిమానులను, అతిథులను ఈ కటౌట్ ఆకట్టుకుంటోంది.
వైఎస్ జగన్పై ప్రభాస్ సెన్సేషనల్ కామెంట్స్.. ఓ వైపు పృథ్వీ దుమారం రేగుతుండగానే ఇంతలో!
ఎల్సీడీ స్క్రీన్లతో అతిపెద్ద వేదిక
‘సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే ప్రాంతంలో భారీ సభా వేధికను ఏర్పాటు చేశారు. ఎల్ సీడీ స్క్రీన్లతో ఏర్పాటు చేసిన ఈ వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. చివరలో కూర్చున్న వారికి సైతం వేదికపై మాట్లాడేవారు స్పష్టంగా కనిపించేలా భారీ తెరలను అమర్చారు.
ప్లైయింగ్ జెట్, కారు నమూనాలు
సినిమాల్లో ఉపయోగించిన ఫ్లయింగ్ జెట్, రేస్ కార్ల నమూనాలను సైతం సభా వేదిక వద్ద ప్రదర్శనకు ఉంచారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ చూడటానికి వచ్చిన అభిమానులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం 5 గంటలకు వేడుక ప్రారంభం కాబోతోంది.
సాహో
సాహో చిత్రాన్ని దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటించగా నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు సైతం పని చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇండియాలో రూపొందిన బిగ్గస్ట్ యాక్షన్ మూవీ ఇది.