Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్: రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాట్లు కేక.. (ఫోటోలు)
ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన 'సాహో' ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్న డ భాషల్లో ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఆదివారం సాయంత్రం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.
'సాహో' చిత్ర బృందం ముంబై, బెంగుళూరు, చెన్నై ఇలా వివిధ ప్రాంతాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్, ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం హైదరాబాద్లో కనీ వినీ ఎరుగని రీతిలో జరుపుతున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు.
అభిమానులను ఆకర్షిస్తున్న 60 అడుగుల భారీ కటౌట్
'కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్' అనేది ప్రభాస్ పాపులర్ డైలాగ్. ‘సాహో' మూవీ ప్రమోషన్లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో 60 అడుగుల ఎత్తులో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంటులో పాల్గొనడానికి వస్తున్న అభిమానులను, అతిథులను ఈ కటౌట్ ఆకట్టుకుంటోంది.
వైఎస్ జగన్పై ప్రభాస్ సెన్సేషనల్ కామెంట్స్.. ఓ వైపు పృథ్వీ దుమారం రేగుతుండగానే ఇంతలో!
ఎల్సీడీ స్క్రీన్లతో అతిపెద్ద వేదిక
‘సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే ప్రాంతంలో భారీ సభా వేధికను ఏర్పాటు చేశారు. ఎల్ సీడీ స్క్రీన్లతో ఏర్పాటు చేసిన ఈ వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. చివరలో కూర్చున్న వారికి సైతం వేదికపై మాట్లాడేవారు స్పష్టంగా కనిపించేలా భారీ తెరలను అమర్చారు.
ప్లైయింగ్ జెట్, కారు నమూనాలు
సినిమాల్లో ఉపయోగించిన ఫ్లయింగ్ జెట్, రేస్ కార్ల నమూనాలను సైతం సభా వేదిక వద్ద ప్రదర్శనకు ఉంచారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ చూడటానికి వచ్చిన అభిమానులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం 5 గంటలకు వేడుక ప్రారంభం కాబోతోంది.
సాహో
సాహో చిత్రాన్ని దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటించగా నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు సైతం పని చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇండియాలో రూపొందిన బిగ్గస్ట్ యాక్షన్ మూవీ ఇది.