Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
65వ జాతీయ అవార్డ్స్ ప్రదానం: శ్రీదేవిని జ్ఞాపకాలతో బోనీ.. బాహుబలి2, ఝాజీ మేకర్స్ హ్యపీ మూమెంట్
Recommended Video
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 65వ నేషనల్ అవార్డ్స్ ప్రధానోత్సవం ఢిల్లీలో గ్రాండ్గా జరిగింది. తెలుగు సినిమా పరిశ్రమ నుండి బాహుబలి చిత్రం 3 విభాగాల్లో జాతీయ అవార్డు గెలుపొందగా, ఉత్తమ తెలుగు చిత్రంగా 'ఘాజీ' చిత్రం ఎంపికైన సంగతి తెలిసిందే. వీటితో పాటు ఆయా విభాగాల్లో అవార్డులకు ఎంపికైన సినిమాలకు అవార్డుల ప్రధానోత్సవం కేంద్ర సమాచార, ప్రసార మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర సహాయమంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ చేతుల మీదుగా జరిగింది. శ్రీదేవి తరుపున బోనీ కపూర్, ఖుషీ కపూర్, జాహ్నవి కపూర్ అవార్డు అందుకున్నారు.
'బాహుబలి-ది కంక్లూజన్' చిత్రానికి గాను ఉత్తమ ప్రజాదరణ, వినోదాత్మక చిత్రం విభాగంలో నిర్మాత దేవినేని ప్రసాద్ అవార్డు అందుకోగా, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ యాక్షన్ విభాగాల్లో కమల్ కన్నన్, కింగ్ సాల్మన్ పురస్కారాలు అందుకున్నారు. 'ఘాజీ' చిత్రం తరుపున సంకల్ప్రెడ్డి, నిర్మాత ప్రసాద్.వి.పొట్లూరి అవార్డులు అందుకొన్నారు.
అవార్డు అందుకోవడం బాహుబలి నిర్మాత ప్రసాద్ దేవినేని మాట్లాడుతూ... చిత్ర టీం మొత్తం ఐదేళ్లు కష్టపడటం వల్లే ఈ రోజు అవార్డు వచ్చిందన్నారు. ఈ అవార్డు తమపై బాధ్యత మరింత పెంచిందని తెలిపారు.
ఝాజీ దర్శకుడు సంకల్ప్రెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు తమలో మరింత ఉత్సాహాన్ని, బాధ్యతను పెంచిందని, మరిన్ని మంచి చిత్రాలు తీయడానికి కృషి చేస్తామని తెలిపారు.
'మామ' చిత్రానికిగాను ఉత్తమ నటి అవార్డు అందుకున్న శ్రీదేవి తరుపున.... ఆమె భర్త బోనీ కపూర్, కూతుళ్లు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్ అవార్డులు స్వీకరించారు. ఈ సందర్భంగా బోనీ కపూర్ మాట్లాడుతూ శ్రీదేవి ఈ పురస్కారానికి పూర్తిగా అర్హురాలని, ఈ సంతోష సమయాన్ని పంచుకోవడానికి ఆమె మన మధ్య లేక పోవడం దురదృష్టకరమని తెలిపారు.