Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ తెలుగు సినిమాకు 8 మంది డైరక్టర్స్
'8"(బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్) టైటిల్ తో ఓ చిత్రం లేటెస్ట్ గా మొదలైంది. ఈ చిత్రం విశేషమేమిటంటే...ఎనిమిదిమంది దర్శకులతో రూపొందటం. దర్శకులు సరే హీరో, హీరోయిన్స్ ఎంతమంది అంటే ఐదుగురు హీరోలు, పదకొండు మంది హీరోయిన్లు అని చెప్తున్నారు. ఫైవ్ఫింగర్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై జలంధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా జలంధర మాట్లాడుతూ-"ఈ చిత్రాన్ని ఎనిమిది వైవిధ్యమైన కథలతో, ఎనిమిది మంది దర్శకులతో ఓ కొత్త తరహా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ చిత్రాన్ని వందరోజుల్లో పూర్తి చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. నవరసాల సమ్మేళనంతో ఈ చిత్ర కథలుంటాయి. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. రెండున్నర గంటలపాటు ప్రేక్షకులను ఆహ్లాదపరిచే విధంగా ఈ చిత్రాన్ని మలుస్తాం. తప్పకుండా ఈ చిత్రం ఓ కొత్త ట్రెండ్ను సృష్టిస్తుందని మా నమ్మకం" అన్నారు. మరి వందరోజుల్లో తీసే ఈ చిత్రం వందరోజూలూ ఆడాలని, ఎనిమిది మంది డైరక్టర్స్ కి సరపడ ప్రేక్షుకులు దీన్ని చూడాలని కోరుకుందాం.