Don't Miss!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
'ఈరోజుల్లో' అంతా బూతేనని సెన్సార్ కు ఫిర్యాదు
అలాగే సినిమా తీయడానికి ప్లానింగ్ ఉండాలి. బడ్జెట్ నియంత్రణలో ఉండే విధంగా మంచి సినిమాను నేను తీసి చూపిస్తానని అప్పుడు చెప్పాను. కుదర్లేదు. కానీ 'ఈరోజుల్లో' చూస్తే అప్పుడు నేను కలగన్న సినిమా ఇలాంటిదే అనిపించింది. ఈ చిత్రం ఇచ్చిన స్ఫూర్తితో నేను కూడా వెంటనే ఓ చిత్రాన్ని మొదలుపెట్టేయాలన్నంత ఉత్సాహం వచ్చింది అని చెప్పుకొచ్చారు. మూడు వారాల క్రితం విడుదలైన లో బడ్జెట్ చిత్రం 'ఈరోజుల్లో'కలెక్షన్స్ పరంగా ఘన విజయం సాధించింది.
దర్శకుడు మారుతి చెబుతూ " మొదటి నుంచీ భరద్వాజగారు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. తక్కువ బడ్జెట్తో సినిమా తీశామని అంటున్నారు. మేం పాషన్తో సినిమా తీశాం. రోజుకు 18 గంటలు కష్టపడ్డాం. ఈ పరిశ్రమకు రాదల్చుకున్న వాళ్ళు ఎవరైనా ముందు దానికి సిద్ధపడాలి'' అన్నారు.
ఇక నిర్మాత ఎస్సేఎన్ మాట్లాడుతూ.. "సినిమా ఇంతటి విజయం సాధిస్తేగానీ పరిశ్రమ మావైపు తిరిగి చూడదని ముందే తెలుసు. అందుకే పెద్ద హిట్టు కొట్టాలనే కసిగా పనిచేశాం. తమ్మారెడ్డిగారి ప్రోత్సాహం మరువలేనిది'' అని అన్నారు. సినిమా విజయం పట్ల శ్రీ, రేష్మి, ఇతర నటీనటులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికే మారుతి కి బయిట నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే హీరో శ్రీనివాస్ కు ఎ ఫిల్మ్ బై అరవింద్ చిత్రం సీక్వెల్ లో హీరోగా ఎంపిక చేసారు.