Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాగార్జునపై మహిళా జర్నలిస్టు ఫిర్యాదు
హీరో నాగార్జునపై ఫ్రీలాన్స్ మహిళా జర్నలిస్టు సునీతాచౌదరి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రిపోర్టర్ ఫిర్యాదు మేరకు 506, 509 సెక్షన్లలో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. సునీతాచౌదరి సెన్సార్బోర్డ్ మెంబర్గా పని చేస్తున్నారు. నాగార్జున తనను అసభ్యపదజాలంతో దూషించి, బెదిరింపులకు గురి చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. సునీతా చౌదరి ది హిందూ పత్రికకు ఫ్రీ జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు. అలాగే సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. నాలుగు రోజుల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఢమరుకం ప్రెస్ మీట్ కు అందరూ రిపోర్టర్లతో కలిసి ఈమె కూడా హాజరయ్యారు.
అక్కడ హీరో నాగార్జున సునీత చౌదరి ని ప్రత్యేకంగా పిలిచి బెదిరించారని, తీవ్రమైన పదజాలంతో, చెప్పలేని బాషలో దూషించారని అభియోగం. నాగార్జున విగ్ పెట్టుకుని నటిస్తున్నారని నాలుగేళ్ల క్రితం సునీత ఓ ఆర్టికల్ రాసారని, అది మనసులో పెట్టుకొని నాగార్జున దూషించారని ఆమె కంప్లైంట్ లో పేర్కొన్నారు.ఇక ఐ.పి.సి 509( అసభ్య పద జాలంతో దూషించడం), 506 (తీవ్రంగా బెదిరించడం ) సెక్షన్ల కింద ఈ కేసు నమోదు అయ్యింది.పోలీసులు ధర్యాప్తు చేస్తున్నామని అన్నారు.