Don't Miss!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'రాజన్న'పై అక్కినేని నాగేశ్వరరావు ట్వీట్
అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడో కానీ ట్విట్టర్ ఉపయోగించి ట్వీట్ చేసారు. తాజాగా ఆయన తన కుమారుడు చేసిన రాజన్న చిత్రం గురించి ట్వీట్ చేసారు. అదేమిటంటే...కన్న ఊరు పట్ల,మాతృదేశం పట్ల అభిమానం ఉండేవాళ్లు రాజన్న తప్పక చూడాలి అని. ఇక ఆ చిత్రం ఆయన స్వంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ పై నిర్మితమైంది. నాగార్జున,స్నేహ కాంబినేషన్ లో చేసిన ఈ చిత్రం ఓ పీరియడ్ మూవీగా తెరకెక్కింది. ఈ చిత్రం ఈ రోజే గురువారం అంతటా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం తెలంగాణా లో జరిగిన రజాకార్ల ఉద్యమం నేపధ్యంలో తెరకెక్కింది. ఆ కాలంలోని రాజన్న అనే తెలంగాణా పోరాట యోధుడు చరిత్రను ఈ చిత్రం చెపుతుంది. ఇక ఈ చిత్రాన్ని రాజమౌళి తండ్రి విజియోంద్ర ప్రసాద్ డైరక్ట్ చేసారు.
అలాగే ఇందులోని యాక్షన్ సన్నివేశాలను మాత్రం రాజమౌళి డైరక్ట్ చేసారు. కీరవాణి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్లస్ గా నిలిచింది. ఈ చిత్రంలోని చాలా పాటలు ఇప్పటికే పాపులర్ అయ్యి, సినిమా హిట్టవటానకి తోర్పడుతున్నాయి. ఇక చిత్రం గురించి నాగార్జున మాట్లాడుతూ వాస్తవ సంఘటనల్ని ప్రేరణగా తీసుకొని అల్లుకొన్న కథ ఇది. స్వాతంత్య్రానంతరం నైజామ్లో ఉన్న పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్టు చూపించాం. కీరవాణి పాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి బలం. యాక్షన్ ఘట్టాల్ని రాజమౌళి తెరకెక్కించిన విధానం ఆకట్టుకొంటుంది. బేబీ అని నటన అందర్నీ కదలిస్తుందని అన్నారు. ఇక ఈ చిత్రానికి అక్కినేని నాగేశ్వరరావు గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు.