Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మగతనాన్ని నిరూపించుకోండి..తమ్మారెడ్డి భరద్వాజకు లేఖ
'టాలీవుడ్ హీరోలు మగాళ్లు కారు' అంటూ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన ప్రకటన ఇంకా టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. ఇలా ప్రకటించటం పద్దతి కాదంటూ ఎ.పి. సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఒ.కళ్యాణ్ తప్పుపట్టారు.ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేసారు. ఆ లేఖలో తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోల మగతనం గురించి మాట్లాడే ముందు భరద్వాజ్ తనని తాను ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే 'తారే జమీన్ పర్' వంటి చిత్రాన్ని తెలుగులో తీయాలనుకుంటే ఒప్పుకునే హీరోలు ఉన్నారా అని భరద్వాజ్ వేసిన ప్రశ్నను ప్రస్తావిస్తూ ఘాటు ప్రశ్నలు వేసారు.
'ఇటువంటి కథతో ఏ తెలుగు హీరోనైనా కలిశారా, కలిస్తే వారు చేయమని తిరస్కరించారా? అలాంటి కథ మీ దగ్గరుంటే మీరే కొత్తవారితో సినిమా తీసి మీ మగతనాన్ని నిరూపించుకునే సత్తా వుందా' అని ఆ లేఖలో ప్రశ్నించారు కళ్యాణ్. 'కుటుంబ సంబంధాలు, నలుగురితో మంచిగా ఉంటూ సమాజశ్రేయస్సు కోరే 'ఆ నలుగురు', 'నేటి సమాజంలో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారిని ఆలోచింపచేసే విధంగా తీసిని 'మీ శ్రేయోభిలాషి' వంటి చిత్రాలు కానీ, ఆ సినిమాలు చేసిన హీరోలు కానీ మీ దృష్టికి రాలేదా' అని భరద్వాజ్ను సూటిగా ప్రశ్నించారు కళ్యాణ్. ఘాటయిన పదజాలంతో ఉన్న ఈ బహిరంగ లేఖను పత్రికల వారికి విడుదల చేశారు ఒ.కళ్యాణ్.ఈ లేఖ విషయమై ఫిల్మ్ సర్కిల్స్ లో ఘాటుగా చర్చలు జరుగుతున్నాయి.