Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'ఉమెన్ ఇన్ బ్రామ్మణిజం' పై కమిటీ నిర్ణయం ఇదే...
అశ్లీలత, అసభ్యత, శృంగారమే లక్ష్యంగా, ఒక కులాన్ని కించపరిచే సన్నివేశాలతో నిర్మించిన 'వుమెన్ ఇన్ బ్రామ్మనిజం' చిత్రాన్ని పూర్తిగా నిషేధించాలని నీలం సహాని నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ చిత్రం ప్రజాప్రదర్శనకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. కమిటీ సమ్వనయకర్తగా వ్యవహరించిన రాష్ట్ర సినిమా, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రవదన్ నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.
"అశ్లీలం, అసభ్యత, శృంగారమే లక్ష్యంగా కేవలం పడకసీన్లతో నిర్మించిన చిత్రాన్ని పూర్తిగా నిషేధించాలి. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఒక కులాన్ని కించపర్చేవిగా ఉన్నాయి. ఈ చిత్రం ప్రజాప్రదర్శనకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు'' అని పేర్కొంటూ నివేదిక రూపొందించింది. ఈ నివేదికను ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్వీ చంద్రవదన్ ప్రభుత్వానికి అందించారు. తమ వినతికి స్పందించి సినిమా పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేసి న్యాయం చేకూర్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బ్రాహ్మణసంఘం నేత ద్రోణంరాజు రవికుమార్ తెలిపారు.
మరో ప్రక్క 'దేనికైనా రెడీ' చిత్రానికి వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా బ్రాహ్మణసంఘాలు చేపట్టిన ఆందోళనపై సర్కారు స్పందించింది. చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచారంటూ వారు పోరాటం చేస్తున్న నేపథ్యంలో.. సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ అధ్యక్షతన దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.