దాసరి సన్మానించనున్న దర్శకుల సంఘం
ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్స్ అసోసియేషన్ స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరపడానికి ఆ సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సీనియర్ దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణరావును సత్కరించడానికి సమాయత్తమవుతున్నారు. ఈ విషయాన్ని దర్శకుల సంఘం అధ్యక్షుడు సాగర్ తెలిపాడు. ఈ మధ్యే ఈ సంఘం తమ కార్యకలాపాలను నూతనంగా నిర్మించిన భవనంలోకి మార్చారు. కాగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు మాత్రం ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలోని రామానాయుడు కళామండపంలో జరుగనున్నాయి. ఈ సందర్భంలో జరిగే దాసరి సన్మానోత్సవానికి 150 మందిపైగా దర్శకులు హాజరు కానున్నారు.


Click it and Unblock the Notifications











