Don't Miss!
- News YS Jagan Stone Attack: జగన్ పై దాడి కేసు విచారణ-ఈసీ జోక్యం కోరిన టీడీపీ..!
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
‘నీవెవరో’ టైటిల్ ఫిక్స్ చేశారు.... సూపర్ అంటున్న హీరో నాని!
ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కబోతున్న చిత్రానికి 'నీవెవరో' టైటిల్ ఫిక్స్ చేశారు. నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా టైటిల్ లోగో గురువారం విడుదల చేశారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మాతలుగా 2017లో వచ్చిన 'నిన్ను కోరి' సినిమా మంచి విజయం సాధించింది. అందులో నాని హీరోగా నటించగా ఆది పినిశెట్టి కీలకమైన పాత్ర చేశారు. ఆ షూటింగ్ సమయంలోనే ఆది హీరోగా సినిమా చేయాలని నిర్మాతలు డిసైడ్ అవ్వగా ఎట్టకేలకు 'నీవెవరో' ప్రారంభం అయింది.
ఆసక్తికరంగా సాగే ప్రేమ కథ
‘నీవెవరో' చిత్రానికి హరినాథ్ దర్శకత్వం వహించగా కోన వెంకట్ కథ అందించారు. ప్రేమకథా చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. హీరో ఆది, తాప్సీ, రితికా సింగ్ మధ్య జరిగే ఈ స్టోరీ ఆసక్తికరంగా ఉండబోతోందని తెలుస్తోంది.
లాంగ్ గ్యాప్ తర్వాత ఆది, తాప్సీ
ఇంతకు ముందు ఆది, తాప్సీ కలిసి ‘గుండెల్లో గోదారి' చిత్రంలో కలిసి నటించారు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్టయింది. వెంకటేష్ మూవీ ‘గురు' సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రితికి సింగ్కు ‘నీవెవరో' రెండో చిత్రం.
ఇద్దరూ ఫాంలో ఉన్న స్టార్సే
ఆది తెలుగులో నటించిన ‘రంగస్థలం' ఇటీవలే విడుదలైన బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ చిత్రంలో ఆది హీరో అనయ్య పాత్రలో నటించారు. తాప్సీ తెలుగులో నటించిన హారర్ కామెడీ ‘ఆనందో బ్రహ్మ' బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇద్దరూ మంచి ఫాంలో ఉన్న స్టార్సే కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి.
|
బెస్ట్ విషెస్ తెలుపుతూ నాని ట్వీట్
‘నీవెవరో' మూవీ టైటిల్ లోగో లాంచ్ చేసిన సందర్భంగా నాని చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు.