Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హీరో మనోజ్ నేను అడుక్కున్నాం.. డబ్బుల్లేక బిచ్చగాళ్లుగా మారాం.. నాని కళ్లలో నీళ్లు.. ఆది
ప్రముఖ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి విలక్షణమైన పాత్రలతో దక్షిణాది సినీ పరిశ్రమలో రాణిస్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన గుండెల్లో గోదారి, సరైనోడు ఆయన నటనా ప్రతిభను భయపెట్టాయి.
ప్రముఖ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి విలక్షణమైన పాత్రలతో దక్షిణాది సినీ పరిశ్రమలో రాణిస్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన గుండెల్లో గోదారి, సరైనోడు ఆయన నటనా ప్రతిభను భయపెట్టాయి. సరైనోడు తర్వాత తెలుగు, తమిళ భాషల్లో బిజీగా మారాడు. సినీ పరిశ్రమలో ఆయనకు మనోజ్ తదితరులు మంచి మిత్రులు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు మనోజ్కు, ఆదికి ఎదుర్కొన్న ఓ సరదా సంఘటనను పంచుకొన్నారు.
పారిస్లో నాకు, మనోజ్కు చేదు అనుభవం
‘మంచు మనోజ్ నాకు చాలా మంచి ఫ్రెండ్. మా నాన్న రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో మోహన్బాబు చాలా సినిమాలు చేశారు. ఆ సమయంలో ఓ సినిమా షూటింగ్ కోసం మోహన్బాబు కుటుంబంతో కలిసి, మా ఫ్యామిలీ కూడా ఫ్రాన్స్కు వెళ్లాం. పారిస్లో ఓ చోట షూటింగ్ జరుగుతున్నది. ఆ సమయంలో ఎవరికీ చెప్పకుండా మనోజ్ నేను కలిసి ఓ బస్ ఎక్కి వేరే చోటుకి వెళ్లాం అని ఆది తెలిపాడు.
జేబులో చిల్లిగవ్వ కూడా లేదు..
అయితే కొన్ని ప్రదేశాలు తిరిగి షూటింగ్ ప్రాంతానికి చేరుకొన్నాం. అయితే అక్కడికి వచ్చేసరికి షూటింగ్ యూనిట్ సభ్యులు ఎవరూ లేరు. దాంతో మాకు చాలా భయమేసింది. జేబులో చిల్లిగవ్వ కూడా లేదు. ఎలా వెళ్లాలో తెలియదు. అప్పడే ఓ ఆలోచన ఫ్లాష్లా మెరిసింది. అదేమిటంటే..
పాటలు పాడి డబ్బులు అడుక్కొన్నాం..
ఫ్రాన్స్లో లాగ్వేంజ్ సమస్య. ఇంగ్లీష్ ఎవరూ మాట్లాడరు. అంతా ఫ్రెంచ్ భాషలోనే మాట్లాడుతారు. దీంతో మాకు ఏం చేయాలో తెలియలేదు. చివరకు ఓ బ్రిడ్డి వద్ద టోపీలు ముందు పెట్టుకుని తెలుగు పాటలు పాడాం. డబ్బుల కోసం బిచ్చగాళ్లుగా మారిపోయాం. మా పాటలు విని కొంతమంది డబ్బులు వేశారు. ఆ డబ్బులతో బస్ ఎక్కి మా వాళ్లను చేరుకున్నాం అని ఆది వెల్లడించారు.
విలన్ పాత్రలపై దృష్టి
సరైనోడు చిత్రం ఆదికి మంచి గుర్తింపు తెచ్చింది. గతంలో తమిళ, తెలుగులో హీరోగా నటించిన ఆది ప్రస్తుతం విలన్ పాత్రలపై దృష్టిపెట్టాడు. ప్రస్తుతం పవన్కల్యాణ్, నాని సినిమాల్లో నటిస్తున్నాడు. నానీ నటించిన చిత్రం నిన్ను కోరి త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో ఆది కీలకపాత్రను పోషిస్తున్నాడు.
నాని కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఆరు, ఏడు సంవత్సరాలుగా నానితో సినిమా చేయాలనుకుంటున్నాను. అది నిన్నుకోరి చిత్రంతో కుదిరింది. కథ వినగానే నాని కళ్లలో నీళ్లు కనిపించాయి. సహజ నటనతో ఉమామహేశ్వరరావు పాత్రకు నాని ప్రాణం పోశాడు అని ఆది అన్నాడు.