Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘ఆగడు’ ప్రీమియర్ షో...ఎక్కడ ఎక్కడ?
హైదరాబాద్: మహేష్ బాబు నటించిన ‘ఆగడు' చిత్రం ఈ నెల 19న గ్రాండ్గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని అభిమానుల కోసం పలు చోట్ల బెనిఫిట్ షోలు ప్లాన్ చేసారు. కొన్ని చోట్ల షోలు ఖరారయ్యాయి కూడా. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లో ఉదయం 6 గంటలకు బెనిఫిట్ షో వేస్తున్నారు. టిక్కెట్ల కోసం రామ్ మోహన్ -7396020584ను సంప్రదించవచ్చు.
అదే విధంగా గుంటూరు జిల్లా పొన్నూరులోని శ్రీలక్ష్మి థియేటర్లో శుక్రవారం తెల్లవారుఝామున 4 గంటలకు బెనిఫిట్ షో వేస్తున్నారు. టిక్కెట్ల కోసం నాగరాజు-8008685363 ను సంప్రదించవచ్చు. ఇక అమెరికా లాంటి చోట్ల ఒకరోజు ముందుగానే భారీ ఎత్తున ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ప్రీమియర్ షో టికెట్ షో రేట్లు భారీగా ఉంటాయని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని గ్రాండ్గా విడుదల చేస్తోంది ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ. సోమవారమే ఆన్ లైన్, అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.
ఆన్ లైన్ బుకింగ్ మొదలైన కొద్ది నిమిషాల్లోనే ఫస్ట్ డే టికెట్స్ అన్నీ అమ్ముడు పోయాయి. ఇక థియేటర్ల వద్ద ఇచ్చే అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ కూడా మంగళవారమే అయిపోయాయి. దీంతో అన్ని థియేటర్ల వద్ద ఫస్ట్ డే టికెట్స్ అయిపోయాయి అంటూ బోర్డులు పెట్టేసారు. ఈరోజు ఫస్ట్ వీకెండ్ (శుక్ర, శని, ఆది) షోలకు సంబంధించిన టికెట్స్ అన్నీ అయిపోతాయని అంచనా.
భారీగా విడుదల, అడ్వాన్స్ బుకింగ్ కూడా జోరుగా సాగడంతో.....‘ఆగడు' ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్ష్ ఏ రేంజిలో ఉంటాయో? అనే ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో నెలకొంది. అటు అభిమానులు కూడా ‘ఆగడు' క్రియేట్ చేయబో రికార్డుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే పెద్దలతో పాటు పిల్లలు కూడా వెళ్లి ఈ సినిమా నిరభ్యరంతంగా చూడొచ్చని అర్థం. ‘ఆగుడు' సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది నిర్మాతలు సినిమా ప్రమోషన్స్ ముమ్మరం చేసారు. మరో వారంలో ‘ఆగడు' విడుదల కానుండటంతో అన్ని థియేటర్లలో...కొత్త థియేట్రికల్ ట్రైలర్ ప్రదర్శిస్తున్నారు.
‘ఆగడు' చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ దాదాపు 55 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. అయితే సినిమా విడుదల ముందే భారీగా బిజినెస్ జరిగింది. శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇలా అన్నీ కలిపి ఇప్పటికే రూ. 75 కోట్ల వరకు నిర్మాతలకు ముట్టాయని అంటున్నారు.
ఈచిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్. 'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఇది. అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు.