Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఈరోస్ చేతికి ‘ఆగడు’...ఇక బాక్సు బద్దలే! రికార్డ్...
హైదరాబాద్: మహేష్ బాబు గత సినిమా ‘1-నేనొక్కడినే' చిత్రాన్ని విడుదల చేసిన ప్రముఖ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘ఈరోస్ ఇంటర్నేషనల్' తాజాగా ‘ఆగడు' చిత్రం విడుదల హక్కులను కూడా చేజిక్కించుకుంది. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ భాగస్వామ్యంతో ఈ నెల 19న ‘ఆగడు' సినిమాను విడుదల చేస్తామని, నాలుగు దక్షిణాది భాషల్లో రికార్డు స్థాయిలో 2000 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇంతకు ముందు ‘1-నేనొక్కడినే' చిత్రం ద్వారా ఒరిగింది ఏమీ లేక పోయినా....‘ఆగడు' చిత్రంపై ఈరోస్ సంస్థ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈరోస్ సంస్థ ఎండి సునీల్ లుల్లా మాట్లాడుతూ...‘మహేష్ బాబు సినిమా విడుదల కోసం 14 రీల్స్ సంస్థతో చేతులు కలపడం చాలా ఎగ్జైటెడ్గా ఉంది. భారీ తారాగణం. మంచి వినోదాత్మక చిత్రం. మహేష్ బాబు-శ్రీను వైట్ల కాంబినేషన్ బాక్సాఫీసు వద్ద మ్యాజిక్ చేస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.
‘ఆగడు' చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ దాదాపు 55 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. అయితే సినిమా విడుదల ముందే భారీగా బిజినెస్ జరిగింది. శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇలా అన్నీ కలిపి ఇప్పటికే రూ. 75 కోట్ల వరకు నిర్మాతలకు ముట్టాయని అంటున్నారు.
ఈచిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్. 'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఇది. అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు.